-
పక్కింట్లో పార్టీ హోరు.. నిద్ర పట్టని ఆమె తీసుకున్న నిర్ణయం ఇదే..
పక్కింటివారి వలన మనం ఒక్కొక్కసారి ఇబ్బందులు పడుతుంటాం. ఇటువంటి సందర్బాల్లో వారికి అభ్యంతరం చెప్పలేక మనకి మనమే సతమతమైపోతుంటాం. ఒక మహిళకు ఇటువంటి అనుభవమే ఎదురయ్యింది. పక్కింటివారి వ్యవహారం వలన ఆమెకు నిద్ర కూడా కరువయ్యింది. దీనిని ఎదుర్కొనేందుకు ఆమె చేసిన ఒక పని అవతలివారి ఆట కట్టించింది. ‘నిద్ర కూడా పోనివ్వడంలేదు’ ఆ మహిళ రెడిట్లో తన అనుభవాన్ని షేర్ చేసింది. తన పక్కింట్లో ఉన్నవారు ప్రతీరోజూ సాయంత్రం పార్టీలు నిర్వహిస్తూ, పెద్ద ఎత్తున మ్యూజిక్ సౌండ్ వినిపిస్తుడటంతో ఆమెకు నిద్ర కూడా పట్టేదికాదు. వీరి ఇళ్ల మధ్య సన్నని గోడ మాత్రమే అడ్డుగా ఉన్న కారణంగా రాత్రివేళ ఆ ఇంటిలోని సౌండ్ హోరు ఈ మహిళను తెగ ఇబ్బంది పెట్టేది. దీంతో ఆ మహిళ నిద్ర పట్టక ఆ విషయాన్ని పక్కింటివారికి చెప్పింది. సౌండ్ తగ్గించాలని కూడా కోరింది. పక్కింటివారు మాట విన్నప్పటికీ.. ఆ మహిళ చెప్పింది విన్న పక్కింటివారు మ్యూజిక్ సౌండ్ తగ్గించినప్పటికీ, అక్కడి వారి మాటల హోరు కారణంగా ఆమె ఇబ్బంది ఏమాత్రం తగ్గలేదు. ఇక ఆ ఇంటిలో ఉండటం కష్టమని ఆమెకు అనిపించింది. ఏ మాత్రం ప్రశాంతత లేదని భావించింది. ‘ఇది మా సమస్య కాదు’ ఈ విధంగా అమె ఐదు నెలల పాటు పక్కింటివారితో ఇబ్బందులను ఎదుర్కొంది. తిరిగి మారోమారు వారిని సౌండ్ తగ్గించాలని కోరింది. అయితే పక్కింటివారు ఆమెతో ‘ఇది మా సమస్య కాదు’ అని సమాధానం ఇచ్చారు. ఈ మాట విన్నవెంటనే ఆమెకు ఆగ్రహం కలిగింది. దీంతో పక్కింటి వారికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంది. వారి శైలిలోని సమాధానం చెప్పాలని.. ఈ మాట వినగానే ఆమె పక్కింటివారికి వారి శైలిలోనే సమాధానం చెప్పాలని అనుకుంది. వెంటనే ఒక పెద్ద స్పీకర్ కొనుగోలు చేసింది. ఫుల్ వాల్యూమ్తో రాత్రంతా మ్యూజిక్ వినిపిస్తూనే ఉంది. దీంతో పక్కింటిలోని వారికి నిద్ర ఎగిరిపోయింది. వెంటనే వారు ఆ మహిళ దగ్గరకు వచ్చి.. మ్యూజిక్ సౌండ్ తగ్గించాలని కోరారు. అప్పుడు ఆమె ‘ఇది నా సమస్య కాదు’ అని సమాధానం చెప్పింది. ‘ఇది పిల్లల ఆట’ ఆ మహిళ పోస్టును చూసిన పలువురు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఒక యూజర్ ‘ఇది పిల్లల ఆట’లా ఉందని పేర్కొనగా, మరొకరు ‘పక్కంటి వారు పార్టీ చేసుకునే సమయంలో మీరు పడుకుంటే అది మీ సమస్య. దానిలో వారి తప్పేమీ లేదు’ అని అన్నారు. ఇంకొక యూజర్ ‘మీరు మంచి పని చేశారు. ఇటువంటి వారికి బుద్ది చెప్పడం ఎంతో అవసరం’ అని అన్నారు. ఇది కూడా చదవండి: సినిమాల్లో నటి నుంచి సెక్స్ రాకెట్ దాకా.. -
ఇదేం పగరా నాయనా.. 1,100 కోళ్లను భయపెట్టి చంపడమేంది?
బీజింగ్: పక్కింటి వ్యక్తిపై ప్రతీకారంతో ఓ వ్యక్తి విచిత్ర చర్యకు పాల్పడ్డాడు. అతనికి చెందిన 1,100 కోళ్లను భయభ్రాంతులకు గురి చేసి వాటి మరణానికి కారణమయ్యాడు. వినడానికి కాస్త వింతగా ఉన్న ఈ ఘటన చైనాలో గతవారం జరిగింది. ఏం జరిగిందంటే..? గూ, జోంగ్ అనే ఇద్దరు పక్కపక్క ఇళ్లలో నివసిస్తారు. గతేడాది ఏప్రిల్లో జోంగ్.. గూ అనుమతి లేకుండా అతని చెట్లను నరికివేశాడు. దీంతో అప్పటి నుంచి గూ పగ పెంచుకున్నాడు. ఈ క్రమంలో తరచూ జోంగ్కు చెందిన కోళ్ల ఫాంకు రాత్రివేళల్లో పలుమార్లు వెళ్లాడు. కొద్ది రోజుల క్రితం ఓ రాత్రి జోంగ్ కోళ్ల ఫాం వద్దకు వెళ్లిన గూ.. సడన్గా ఫ్లాష్లైట్ ఆన్ చేశాడు. దీంతో అవి భయభ్రాంతులకు గురై అన్నీ ఓ మూలకు వెళ్లాయి. ఈ క్రమంలో ఒకదానిపై మరొకటి పడి 500 కోళ్లు చనిపోయాయి. జోంగ్ ఫిర్యాదు మేరకు గూను పోలీసులు అరెస్టు చేశారు. 500 కోళ్ల మరణానికి కారణమైనందుకు అతనికి రూ.35,713 జరిమానా కూడా విధించారు. ఆ తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన గూకు పక్కింటి వ్యక్తిపై పగ మాత్రం చల్లారలేదు. దీంతో మరోసారి రాత్రివేళ కోళ్లఫాంకు వెళ్లి మళ్లీ ఫ్లాష్ లైట్ ఆన్ చేశాడు. ఈ సారి దాదాపు 640 కోళ్లు మరణించాయి. పోలీసులు మళ్లీ అతడ్ని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. గూ కావాలనే జోంగ్ కోళ్లను చంపి నష్టం కలిగేలా చేశాడని కోర్టు నిర్ధరించింది. అతడ్ని దోషిగా తేల్చి ఆరు నెలల కఠిన కారాగార శిక్ష విధించింది. చనిపోయిన 1,100 కోళ్ల విలువ రూ.1,60,000కు పైనే ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. చదవండి: నిరుపేదలుగా మారిన బిల్ గేట్స్, ట్రంప్, మస్క్, ‘ఇంత ఘోరంగా ఉన్నారేంటి!’ -
కూతురుపై అత్యాచారం.. తల్లిదండ్రుల దగ్గరకు వీడియో చేరడంతో..
జైపూర్: రాజస్థాన్లో అమానవీయకర సంఘటన చోటుచేసుకుంది. ఇంటిపక్కన.. ఉండే వ్యక్తి మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అజ్మీర్కు చెందిన బాలిక ఎనిమిదో తరగతి చదువుకుంటుంది. బాలిక ఇంటిపక్కన ఒక వ్యక్తి.. డ్రైవర్గా పనిచేసేవాడు. ఈ క్రమంలో.. ఈనెల (నవంబరు20) బాలికను పనుందని ఒకసారి ఇంటికి రావాలని పిలిచాడు. పాపం.. ఒకే కాలనీలో ఉండేవాడు.. తెలిసిన వారే అని బాలిక అమాయకంగా అతగాడి ఇంటికి వెళ్లింది. అప్పుడు ఆ దుర్మార్గుడు .. బాలిక ఇంట్లోకి రాగానే వెంటనే తలుపులు వేసేశాడు. ఆ తర్వాత బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ దుర్మార్గాన్ని వీడియో కూడా తీశాడు. ఎవరికైనా.. చెబితే వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. ఆ బాలిక షాక్తో ఎవరికి చెప్పకుండా ఉండిపోయింది. ఆ కామాంధుడు మాత్రం వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. దీంతో వైరల్గా మారింది. ఆ వీడియోలో బాలికను చూసి కాలనీవాసులు షాక్కు గురయ్యారు. ఆతర్వాత .. వీడియో ఉదంతాన్ని బాలిక తల్లిదండ్రులకు తెలిపారు. దీంతో తల్లిదండ్రులు నిందితుడిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
తన భార్యను కరిచిందని కుక్కపై ప్రతీకారం..
భోపాల్: మధ్య ప్రదేశ్లో దారుణం చోటుచేసుకుంది. తన భార్యను పక్కింట్లోని పెంపుడు కుక్క కరిచిందని రివాల్వర్తో కాల్చిచంపాడో వ్యక్తి. వివరాలు.. ఇండోర్లోని సుదామ నగర్ అపార్ట్ మెంట్లో నరేంద్ర విశ్వయ్య అనే వ్యక్తి ఉంటున్నాడు. అతని పక్కింట్లో ఒక వ్యక్తి కుక్కను పెంచుకుంటున్నాడు. అయితే, అది విశ్వయ్య భార్యను కరిచింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన సదరు వ్యక్తి, వెంటనే తన లైసెన్స్డ్ తుపాకితో ఆ కుక్కను కాల్చిచంపాడు. దీనిపై ఆ శునకం యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు, నరేంద్రను అదుపులోకి తీసుకొని జంతువులపై క్రూరత్వంగా ప్రవర్తించడం, లైసెన్స్గన్ను దుర్వినియోగం చేయడం వంటి వివిధ సెక్షన్ల కింద కేసులను నమోదు చేశారు. ఈ సంఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తామని ఇండోర్ పోలీసు అధికారి మనీష్ మహోర్ తెలిపారు. పోలీసుల విచారణలో ప్రాథమికంగా ఆ కుక్క ఇది వరకే చాలా మందిని కరిచి, గాయ పర్చిందని తెలింది. ఒక వేళ నిందితుడి వాదనే నిజమైతే శునకం యజమానిపై కూడా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. చదవండి: పెళ్లిలో వధువు చేసిన పనికి బిత్తరపోయిన వరుడు! -
కుక్క మలవిసర్జన..దంపతులపై కేసు!
భద్రాచలం: భద్రచలం పట్టణంలోని శిల్పినగర్కు చెందిన దంపతులపై సోమవారం కేసు నమోదైంది. కాగా, పోలీసుల కథనం ప్రకారం... శిల్పినగర్కు చెందిన నగేష్రెడ్డి దంపతులు ఒక పెంపుడు కుక్క ను పెంచుకొంటున్నారు. అయితే అది తరచుగా , వారి ఇంటికి ఎదురుగా ఉన్న వెంకటరమణ అనే వృద్ధురాలి ఇంటి గుమ్మం వద్దకు వెళ్లి మలమూత్ర విసర్జన చేస్తోంది. దీనిపై వృద్ధురాలు నగేష్రెడ్డి దంపతులను ఎన్నోమార్లు చెప్పింది. ప్రతిరోజు కుక్కరావడం ఆమె గుమ్మం ముందు మల విసర్జన చేయడం పరిపాటిగా మారింది. కాగా, ఆ దంపతులు మాత్రం ఎంతగా చెప్పినా పట్టించుకొలేదు. అయితే ఆ దంపతులు వృద్దురాలిపై కోపాన్ని పెంచుకున్నారు. నగేష్ దంపతులు వృద్ధురాలి ఇంటికి వెళ్లి దాడి చేసి గాయపర్చారు. ఆమె వెంటనే నగేష్ దంపతులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసును నమోదు చేసుకున్నారు. చదవండి: వైరల్: అమ్మో..పాము ఎంత భయంకరంగా దాడిచేసింది! -
తాగిన మైకంలో పొరుగింటికి వెళ్లి..
లండన్ : తాగిన మైకంలో ఓ వ్యక్తి తన ఇల్లు అనుకుని పొరుగింటికి వెళ్లడమే కాక ఆ ఇంటి యజమానిని దొంగ అనుకుని హతమార్చిన ఘటన కలకలం రేపింది. మిసోరికి చెందిన మైఖేల్ అగస్టీన్ తన పొరుగున ఉండే 60 ఏళ్ల మాజీ సైనికుడిని హత్య చేశాడు.పొరుగింటి వ్యక్తిని పొట్టనపెట్టుకున్న వెంటనే మైఖేల్ అగస్టీన్ (43) పోలీసులకు ఫోన్ చేసి తన ఇంట్లో అక్రమంగా ప్రవేశించిన వ్యక్తిని చంపేశానని చెప్పడంతో అసలు విషయం బయటపడింది. తీరా అగస్టీన్ చెప్పిన అడ్రస్కు చేరుకున్న పోలీసులకు తాళం వేసిన ఇల్లు కంటపడింది. ఇంటి బయట ఎవరూ తారసపడకపోవడంతో వారికి సందేహం కలిగింది.చుట్టుపక్కల విచారించిన పోలీసులకు పొరుగునే ఉన్న ఇంట్లో మైఖేల్ చేసిన నిర్వాకం తెలిసింది. మాజీ సైనికుడిని ఆస్పత్రికి తరలించగా ఆయన మరణించినట్టు వైద్యులు వెల్లడించారు. తప్పతాగిన స్థితిలో ఉన్న మైఖేల్ను హత్యా నేరంపై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
చచ్చాక ఆడుకోడానికని పొరుగువాణ్ని చంపేశాడు!
బీజింగ్: చైనాలోని ఝెజియాంగ్ ప్రావిన్స్కు చెందిన లియావో(54) కుటుంబ సమస్యలతో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. అయితే చచ్చాక ఒంటరివాడి ని అవుతానే మోనన్న బాధ తెగ వేధించింది. అందుకే పొరుగింటి మిత్రుడు (57) కూడా చచ్చిపోతే తోడొస్తాడు కదా! ఎంచక్కా.. ఇద్దరూ కలిసి స్వర్గంలో చెస్ ఆడుకోవచ్చని అనుకున్నాడు. ఇంకేం.. మంగళవారం రాత్రి అతడిని గొంతు నులిమి చంపేశాడు. పక్క గదిలోకి వెళ్లి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటి యజమానురాలు అద్దె వసూలు కోసం రావడంతో ఈ సంఘటన వెలుగు చూసింది. లియావో ఎప్పుడూ ఎవరితోనూ కలిసేవాడు కాదని, విపరీత మనస్తత్వంతో కనిపించేవాడని ఆమెను ఉటంకిస్తూ ‘షాంఘై డైలీ’ ఈ మేరకు ఓ కథనంలో పేర్కొంది. అన్నట్టూ.. ఆత్మహత్యకు ముందు లియావో సూసైడ్ నోట్ కూడా రాశాడు. స్వర్గంలో చెస్ ఆడేందుకు తోడుగా ఉంటాడనే పొరుగింటి మిత్రుడిని చంపినట్లు పేర్కొన్నాడని పోలీసులు తెలిపారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
అతడి కంటే చెత్త కెప్టెన్ ఎవరూ లేరు.. పైగా హార్దిక్ను అంటారా?
సుచి లీక్స్.. నాకు ఆ ఫొటోలు త్రిషనే ఇచ్చింది: సుచిత్ర
టీవీ రిమోట్ పనిచేయడం లేదా..? చిట్కా మీ కోసమే..
‘మృతి చెందిన యువతికి వరుడు కావలెను’
హాలీవుడ్ తెరపై ఓ సాహస యాత్ర
‘కాంగ్రెస్ గూండాల దాడి.. ఇదా రాహుల్ గాంధీ ప్రేమ దుకాణం?’
గుర్తు పెట్టుకోలేనన్ని హామీలిచ్చి.. ఇప్పుడు గుర్తుకు రావడం లేదంటే ఎలా సార్! గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదంటారా!!
ప్లీజ్ నన్ను ట్రోల్ చేయండి..
రాజమాత మాధవి రాజే సింధియా కన్నుమూత
లక్నోపై ఢిల్లీ గెలుపు.. ప్లే ఆఫ్స్లో రాజస్తాన్
తప్పక చదవండి
- ఇవాళే అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం!
- అతనితో 16 రోజులే ఉన్నాను.. రెండో పెళ్లి చేసుకోవాలని ఉంది: ఎస్తర్
- BCCI: టీమిండియా హెడ్కోచ్గా వాళ్లిద్దరిలో ఒకరు?
- మనీష్ సిసోడియా జ్యుడిషీయల్ కస్టడీ పొడగింపు
- కెనడాలో ఘనంగా పదేళ్ల తెలంగాణ ఉత్సవాలు!
- పాడెపై వెళ్లి నామినేషన్! గోరఖ్పూర్లో విచిత్రం
- రామ్-పూరీ 'డబుల్ ఇస్మార్ట్' టీజర్ ఎలా ఉందంటే?
- సీజన్ మొత్తం మాకు అదే సమస్య.. అందుకే ఈ దుస్థితి: కేఎల్ రాహుల్
- 100 విమానాలు కొనుగోలు చేయనున్న ఇండిగో.. ఎందుకంటే..
- Bhuma VS AV! అఖిలప్రియ బాడీ గార్డ్ పరిస్థితి విషమం
Advertisement