-
డెంగీ పరీక్షలన్నీ ఉచితం
సాక్షి, హైదరాబాద్: డెంగీ పరీక్షలన్నీ ఉచితంగా చేయాలని వైద్య ఆరోగ్యశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బుధవారం రాత్రి ఆదేశాలు జారీచేసింది. అన్ని బోధనాసుపత్రులతోపాటు హైదరాబాద్ ఫీవర్ ఆసుపత్రి, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం)లోనూ డెంగీకి సంబంధించి ఎలైసా పరీక్షలు ఉచితంగా చేయాలని నిర్ణయించింది. అలాగే డెంగీ, వైరల్ ఫీవర్కు సంబంధించిన పరీక్షలు కూడా ఉచితంగా చేయాలని స్పష్టంచేసింది. ఆయా ఆసుపత్రులు, పరీక్షా కేంద్రాల్లో డెంగీ పరీక్షలు ఉచితమంటూ ప్రజలందరికీ కనిపించేలా బోర్డు లు కూడా ప్రదర్శించాలని సూచించింది. అన్ని చోట్లా ఎక్కువ కౌంటర్లను ఏర్పాటు చేయాలని, గంటకు మించి ఎవరూ వేచి చూడకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎక్కడా డబ్బులు వసూలు చేయకూడదని స్పష్టంచేసింది. ప్రైవేటు ఆసుపత్రులు కూడా ఈ సదుపాయం ఉపయోగించుకోవచ్చని తెలిపింది. వైద్యులు అందుబాటులో ఉండాలని పేర్కొంది. ఈ మేరకు వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశాలు జారీచేశారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో తప్పుడు రిపోర్టులు... రాష్ట్రంలో డెంగీ కేసులు వేలాదిగా నమోదవుతున్నాయి. అయితే, ప్రైవేటు ఆసుపత్రులు, డయాగ్నోస్టిక్ సెంటర్లు డెంగీ ఉన్నా, లేకపోయినా తప్పుడు రిపోర్టులు ఇస్తున్నాయని.. ప్లేట్లెట్లు ఎక్కువగా ఉన్నా, తక్కువగా చూపిస్తున్నాయంటూ ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. ప్లేట్లెట్ల గుర్తింపులో ప్రైవేటు ఆసుపత్రులు అనేక మతలబులు చేస్తున్నాయని సర్కారు గుర్తించింది. తప్పుడు రిపోర్టులు చూపించి దోపిడీ చేస్తున్నాయని నిర్ధారణకు వచ్చింది. మరోవైపు ప్లేట్లెట్లు పడిపోయే తీవ్రతను బట్టి రూ.40 వేల నుంచి రూ.లక్ష వరకు వరకు వసూలు చేస్తున్నట్లు బాధితులు చెబుతున్నారు. సాధారణంగా ప్లేట్లెట్ల సంఖ్య 20వేల లోపునకు పడిపోతేనే సమస్య పెరుగుతుందని.. అప్పుడే ప్లేట్లెట్లు ఎక్కించాల్సి ఉంటుందని వైద్యులు స్పష్టంచేస్తున్నారు. కానీ పలు ప్రైవేటు ఆసుపత్రులు ప్లేట్లెట్లు 50వేలకు పడిపోయినా ఐసీయూకు తరలించి చికిత్స చేసి లక్షలు గుంజుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇలాంటి అక్రమాలను నిరోధించేందుకు ప్రభుత్వమే ఉచితంగా డెంగీ పరీక్షలు చేయాలని నిర్ణయం తీసుకుంది. -
కాకినాడ రూరల్కు జ్వరమొచ్చింది
కాకినాడ రూరల్ : కాకినాడ రూరల్ మండలానికి జ్వరమొచ్చింది. మండలంలోని తిమ్మాపురం, ఇంద్రపాలెం, స్వామినగర్, తూరంగి, కొవ్వూరు, రమణయ్యపేట, వాకలపూడి, సూర్యారావుపేట, వలసపాకల గ్రామాల్లో జ్వరపీడితులు రోజురోజుకూ పెరుగుతున్నారు. రెండు రోజుల కిందట ఇంద్రపాలెంలో 12 ఏళ్ల బాలుడికి జ్వరం వచ్చి ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గిపోయింది. అతడికి డెంగీ పరీక్షలు చేశారు. ఈ నేపథ్యంలో జ్వరాల తీవ్రతను గుర్తించేందుకు వైద్యాధికారులు అన్ని గ్రామాలనూ జల్లెడ పడుతున్నారు. వారం రోజుల క్రితం బినిపే కామేష్ అనే వ్యక్తి గల్ఫ్ నుంచి తిమ్మాపురం వచ్చాడు. వచ్చినప్పటి నుంచీ జ్వరంతో బాధ పడుతున్నాడు. పండూరు పీహెచ్సీ వైద్యురాలు జి.లక్ష్మి ట్రీట్మెంట్ ఇచ్చినా జ్వరం తగ్గకపోగా, చుట్టుపక్కల ఉన్న మరో ఏడుగురు కూ డా జ్వరాలబారిన పడ్డారు. దీంతో తిమ్మాపురంలో ప్రత్యేక వైద్యశిబిరం ఏర్పాటు చేశారు. గ్రామానికి చెందిన సలాది మహేష్, సలాది పాప అనే ఇద్దరు జ్వరం, విరేచనాలతో బాధపడుతూండడంతో అధికారులు ఆగమేఘాల ప్లూయిడ్స్ ఎక్కిస్తున్నారు. గత ఏడాది తూరంగి డ్రైవర్స్ కాలనీలో ఇద్దరు పిల్లలు డెంగీతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈసారి కూడా డెంగీ విజృంభిస్తుందేమోనని పలు గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అధ్వానంగా పారిశుద్ధ్యం పారిశుద్ధ్య లోపమే జ్వరాల తీవ్రతకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. నగరం, గ్రామం అన్న తేడా లేకుండా అంతటా పారిశుద్ధ్యం అధ్వానంగానే ఉంది. గ్రామాల్లో మురుగు కాలువల నిర్మాణం సరిగా లేకపోవడం, పూడికలు తీయకపోవడంతో కొన్నిచోట్ల రోడ్లపైనే మురుగు మడుగు కడుతుంది. ఈ ప్రాంతాలు దోమలకు కేంద్రాలుగా మారుతున్నాయి. గ్రామాల్లో ఇళ్ల మధ్యనే పెంటకుప్పలు ఉంటున్నాయి. ఇక్కడ పందులు, కుక్కలు చేరడంతో పరిస్థితి మరింత దిగజారుతోంది. కొన్ని కాలనీలు, గ్రామాల్లో సిమెంటు రోడ్లు నిర్మించినా కాలువలను విస్మరించడంతో ఇళ్లలో వాడుక నీరు, మురుగు నీరు ఎక్కడికక్కడే నిలచిపోతోంది. గ్రామాల్లో పారిశుధ్యం మెరుగుదలకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తున్నా వాటిని అధికారులు ఖర్చు చేయడం లేదు. ఫలితంగా పారిశుధ్యం నానాటికీ దిగజారుతోంది. ఈ లక్షణాలుంటే.. * విపరీతంగా చలి, చెమట, తలపట్టడం, వాంతులతో కూడిన జ్వరం వస్తే మలేరియాగా అనుమానించాలి. సమీప ఆరోగ్య కేంద్రాల్లో రక్త పరీక్షలు చేయించుకోవాలి. * జలుబు, దగ్గుతోపాటు జ్వరం వస్తే వైరల్ జ్వరంగా అనుమానించాలి. జలుబు, దగ్గు ఉన్న వ్యక్తి నోటికి, ముక్కుకు రుమాలు అడ్డంగా పెట్టుకోవాలి. లేకుంటే వైరస్ మరో వ్యక్తికి వ్యాపిస్తుంది. * ఒక్కసారిగా 100 నుంచి 102 డిగ్రీల జ్వరం వచ్చి మళ్లీ తగ్గుతూ ఉంటుంది. ఇలా రోజుకు నాలుగైదుసార్లు ఉంటుంది. వారంపాటు ఇలాగే ఉంటే టైఫాయిడ్గా భావించాలి. వెంటనే వైద్యులను సంప్రదించాలి. కలుషిత నీరు, ఫంగస్ వల్ల ఈ జ్వరం వస్తుంది. * 103 నుంచి 104 డిగ్రీల జ్వరం, ఒళ్లు నొప్పులు వచ్చి కొద్ది రోజుల తరువాత మళ్లీ తిరగపెడితే చికున్గన్యా జ్వరంగా భావించాలి. ఒకసారి ఈ జ్వరం వస్తే నీర్సం, నొప్పుల నుంచి తేరుకోవడానికి చాలా సమయం పడుతుంది. కీళ్ల నొప్పులతో కదల్లేని పరిస్థితి ఏర్పడుతుంది. కాళ్లు, చేతులు వాచుతాయి. దోమ కాటు ద్వారా ఈ జ్వరం వ్యాపిస్తుంది. * హఠాత్తుగా జ్వరం, కళ్లు కదిలించలేని పరిస్థితి, ఎముకలు, కండరాల్లో విపరీతమైన నొప్పి వస్తే డెంగీగా అనుమానించాలి. జ్వరం వచ్చిన రెం డో రోజు నుంచి వెన్నెముక నొప్పి, కనుబొమ్మ ల వాపు, వాంతులు, చర్మంపై దద్దుర్లు ఏర్పడతాయి. వారం రోజుల పాటు ఇలానే ఉంటే రక్తంలో ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గుతుంది. ఒకసారి వచ్చిన జ్వరం 10 రోజుల తరువాత మళ్లీ తిరగబెడుతుంది. వాంతులు, వికారం, రక్తంతో కూ డిన మలవిసర్జన వ్యాధి తీవ్రమైందనడానికి గు ర్తులు. ఇది దోమ ద్వారానే వ్యాప్తి చెందుతుం ది. పూర్తిగా వైద్యుని పర్యవేక్షణలోనే ఉండాలి. -
ఒడిశాలో భారీగా డెంగ్యూ కేసులు
ఒడిశాలో ఈ ఏడాది భారీగా డెంగ్యూ కేసులు నమోదైయ్యాయి. ఇప్పటివరకు 5,535 డెంగ్యూ కేసులు నమోదైనట్టు అక్కడి అధికారులు వెల్లడించారు. కాగా శనివారం మరో 31 డెంగ్యూ కేసులు నిర్దారణ అయినట్టు తెలిపారు. మరోవైపు ఇప్పటివరకూ నమోదైన 11 డెంగ్యూ కేసులు జైపూర్ తీరప్రాంతంలోనని నివేదికలో వెల్లడైంది. దాంతోపాటు జగత్సింగ్పూర్ జిల్లాలో కూడా 8కేసులు నమోదైయ్యాయి. ఇప్పటికే డెంగ్యూ వైరస్ సోకిన 73మంది బాధితులు ప్రస్తుతం కటక్లోని చంద్ర బంజా మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఐదుగురికి వైరస్ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స అందిస్తున్నారు. అయితే గత ఏడాది 6వేల 753మందికి డెంగ్యూ పరీక్షలు చేయగా వారందరికి వ్యాధి లక్షణాలు ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
సోషల్ మీడియాలో వైరల్గా మారిన టీడీపీ, జనసేన వీడియో
రోహిత్ శర్మతో పాటు షకీబ్!.. ఎవరికీ సాధ్యం కాని రికార్డు!
ఏపీ పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రాపై వైఎస్సార్సీపీ ఫిర్యాదు
ఈసీ బదిలీ చేసిన చోటే ఈ దారుణాలు
రాజశ్యామల సహస్ర చండీయాగం వేద ఆశీర్వచనం ఇచ్చిన వేద పండితులు
కొంతమంది పోలీసులు టీడీపీ వాళ్ళతో కుమ్మక్కై: అంబటి
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (15-05-2024)
స్టార్ క్రికెటర్ ప్రపోజ్.. హీరోయిన్ ఏమన్నారంటే!
గర్భస్త శిశువుకూ జీవించే హక్కుంది: సుప్రీం సంచలన తీర్పు
స్వాతి మలివాల్పై దాడి.. కేజ్రీవాల్ మౌనమేల?
తప్పక చదవండి
- పంచాయత్ సీజన్ 3 ట్రైలర్ విడుదల
- అమ్ముడుపోని లక్షలాది ఇళ్లు.. చైనా కీలక ప్రతిపాదన!
- నాన్స్టిక్ పాత్రలు వినియోగిస్తున్నారా? ఐసీఎంఆర్ స్ట్రాంగ్ వార్నింగ్!
- ఆంధ్రాలో చిన్న ఆలయానికి జూ.ఎన్టీఆర్ భారీ విరాళం
- ‘ఆ దేవాలయాలు నిర్మించాలంటే 400కుపైగా సీట్లు కావాల్సిందే’
- అతడి కంటే చెత్త కెప్టెన్ ఎవరూ లేరు.. పైగా హార్దిక్ను అంటారా?
- పల్నాడు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
- ఇవాళే అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం!
- BCCI: టీమిండియా హెడ్కోచ్గా వాళ్లిద్దరిలో ఒకరు?
- NewsClick Row: ప్రబీర్ తక్షణ రిలీజ్కు సుప్రీం కోర్టు ఆదేశం
Advertisement