Lok Sabha Election 2024: ఈసారి యూట్యూబ్‌ హవా! | Sakshi
Sakshi News home page

Lok Sabha Election 2024: ఈసారి యూట్యూబ్‌ హవా!

Published Tue, May 14 2024 4:15 AM

Lok Sabha Election 2024: Election in India is playing out on YouTube

డిజిటల్‌ ఎన్నికల ప్రచారంలో దుమ్మురేపుతున్న వైనం 

ఈసారి పారీ్టలు, నేతలు, కంటెంట్‌ క్రియేటర్లకు కీలక వేదిక 

గత నెల రోజుల్లో భారీగా పెరిగిన వ్యూస్, సబ్‌్రస్కయిబర్లు 

2014 ఎన్నికల్లో ఫేస్‌బుక్, 2019లో వాట్సాప్‌ జోరు

సార్వత్రిక ఎన్నికల వేడి సోషల్‌ మీడియాలోనూ సెగలు పుట్టిస్తోంది. ఫేస్‌బుక్‌.. వాట్సాప్‌.. ఇన్‌స్టా.. ఎక్స్‌.. యూట్యూబ్‌.. ఇలా సోషల్‌ ప్లాట్‌ఫాముల్లోనే మునిగి తేలుతున్న నెటిజన్లకు చేరువయ్యేందుకు పారీ్టలు కూడా ఆ వేదికలనే అడ్డగా మలచుకుంటున్నాయి. 

రాజకీయ విశ్లేషకులతో పాటు కంటెంట్‌ క్రియేటర్లు కూడా జోరు పెంచడంతో రెండు నెలలుగా డిజిటల్‌ ప్రచారం దుమ్ము రేగిపోతోంది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో పారీ్టలు ఎక్కువగా ఫేస్‌బుక్‌పై దృష్టి పెట్టగా 2019కు వచ్చేసరికి ప్రధానంగా వాట్సాప్‌ను నమ్ముకున్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం డిజిటల్‌ క్యాంపెయినింగ్‌కు యూట్యూబ్‌ 
కీలక వేదికగా మారింది... 

సాధారణంగా యూట్యూబ్‌లో వినోదాత్మక కంటెంట్‌కు మంచి గిరాకీ ఉంటుంది. ఎన్నికల పుణ్యమా అని నెల రోజులుగా సీరియస్‌ రాజకీయ కంటెంట్‌కు ఒక్కసారిగా వ్యూస్‌ విపరీతంగా పెరిగిపోతున్నాయి. సబ్‌్రస్కయిబర్లు భారీగా ఎగబాకుతున్నారు. 

సోషల్‌ మీడియా డేటాను విశ్లేíÙంచే సోషల్‌ బ్లేడ్‌ గణాంకాల ప్రకారం రాజకీయ థీమ్‌తో కంటెంట్‌ క్రియేట్‌ చేస్తున్న ధృవ్‌ రాఠీకి ఒక్క ఏప్రిల్‌ నెలలోనే ఏకంగా 25 లక్షల మంది యూజర్లు దక్కడమే ఇందుకు నిదర్శనం! ఇక డిజిటల్‌ న్యూస్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మారిన రవీశ్‌ కుమార్, అభిసార్‌ శర్మ వంటి టీవీ జర్నలిస్టుల యూట్యూబ్‌ ఛానెల్స్‌ కూడా మూడు లైక్‌లు, ఆరు షేర్లుగా దూసుకెళ్తున్నాయి. వీరిద్దరి ఛానెల్స్‌ నెలవారీ వ్యూస్‌ వరుసగా 175 శాతం, 115 శాతం చొప్పున ఎగబాకాయి! 

షార్ట్‌ వీడియోలే ట్రెండింగ్‌... 
గత ఎన్నికల్లో వాట్సాప్‌ గ్రూపుల ద్వారా డిజిటల్‌ మెసేజ్‌లను పార్టీలన్నీ బాగా వాడుకున్నాయి. ఇందుకోసం కొన్ని పారీ్టలైతే ఏకంగా 2 లక్షలకు పైగా వాట్సాప్‌ గ్రూపులను క్రియేట్‌ చేసినట్లు రషీద్‌ చెబుతున్నారు! కానీ ఇప్పుడు నెటిజన్ల అభిరుచులతో పాటు ట్రెండ్‌ కూడా మారిపోయింది. ముఖ్యంగా 30 సెనక్ల కంటే తక్కువ నిడివిగల చిన్నపాటి వీడియో క్లిప్‌లకు భలే క్రేజ్‌ ఉంది. వాస్తవానికి ఈ ట్రెండ్‌ టిక్‌టాక్‌తో మొదలైంది. దాన్ని బ్యాన్‌ చేయడంతో యూట్యూబ్‌ షార్ట్స్, ఇన్‌స్టా రీల్స్‌ ఇప్పుడు దుమ్ము రేపుతున్నాయి. 

స్మార్ట్‌ ఫోన్‌ యూజర్లు భారీగా పెరగడం, డేటా చౌకగా లభించడం, మొబైల్‌ ఇంటర్నెట్‌ స్పీడ్‌ పెరగడం కూడా దీనికి ప్రధాన కారణాలే. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత చౌక డేటా ప్లాన్లు ఉన్న దేశాల్లో భారత్‌ది ఏడో స్థానం. స్మార్ట్‌ ఫోన్‌లోనే ఈజీగా కంటెంట్‌ క్రియేట్‌ చేయగల వీడియో ఎడిటింగ్‌ యాప్‌లు అందుబాటులోకి రావడం షార్ట్‌ వీడియోలకు బాగా కలిసొస్తోంది. 

కేవలం ఫొటో, మెసేజ్‌లతో కాకుండా చిన్న వీడియోలతో పారీ్టలు తమ అభిప్రాయాలను మరింత ప్రభావవంతంగా ఓటర్లకు చేరవేసేందుకు వీలవుతుండటం వల్లే యూట్యూబ్‌ ఈ ఎన్నికల్లో కీలక ప్రచార వేదికగా మారింది. అంతేగాక ప్రధాన టీవీ ఛానెళ్లలో ముఖ్యమైన ప్రజా సమస్యలకు తగిన కవరేజీ దక్కడం లేదని యూట్యూబ్‌ క్రియేటర్లు అంటున్నారు. దాంతో అలాంటి వార్తలు చూపించే యూట్యూబ్‌ ఛానెళ్లకు డిమాండ్‌ బాగా పెరుగుతోందని చెబుతున్నారు.

రాజకీయ యాడ్లకూ తగ్గేదేలే... 
యూట్యూబ్‌ డిజిటల్‌ ప్రచార హవా పార్టీల అడ్వర్టయిజింగ్‌ వ్యయాల్లోనూ స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరి 5 నుంచి మే 4 మధ్య బీజేపీ, కాంగ్రెస్‌ గూగుల్‌ యాడ్స్‌ కోసం కేవలం వీడియోలపైనే అత్యధిక నిధులను వెచి్చంచాయి. వివిధ ఫార్మాట్ల ద్వారా మెటా యాడ్స్‌కు ఖర్చు చేసిన దానికంటే ఇది మూడు రెట్లు అధికం కావడం గమనార్హం. వీడియో కంటెంట్‌కు సంబంధించి కాషాయ పార్టీ గూగుల్‌ యాడ్స్‌కు రూ.50.4 కోట్లు ఖర్చు చేయగా, మెటా యాడ్స్‌కు రూ. 15.4 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. ఇక కాంగ్రెస్‌ గూగుల్‌ యాడ్స్‌కు రూ.24.5 కోట్లు, మెటాకు రూ.8.1 కోట్ల చొప్పున వెచ్చించింది.

యూజర్లు రయ్‌.. రయ్‌.. 
ఎన్నికల హడావుడి మొదలైన ఫిబ్రవరి నుంచి చూస్తే... చాలామంది నాయకులు, పారీ్టల యూట్యూబ్‌ సబ్‌్రస్కయిబర్లు 2 నుంచి ఏకంగా 4 రెట్లు పెరగడం విశేషం. వీరిలో రాఘవ్‌ చద్దా (ఆప్‌–4.2 లక్షల యూజర్లు), శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ (బీజేపీ– 2.7 లక్షలు), రేవంత్‌ రెడ్డి (కాంగ్రెస్‌– 2.05 లక్షలు) వంటి నేతలు ప్రధానంగా ఉన్నారు. పారీ్టలపరంగా ప్రస్తుతం యూట్యూబ్‌లో ఆమ్‌ ఆద్మీ పారీ్టదే హవా! ఏకంగా 63.4 లక్షల సబ్‌స్రయిబర్లతో ఆప్‌ దేశంలోనే టాప్‌లో ఉంది. బీజేపీకి 59.1 లక్షల మంది యూజర్లుండగా కాంగ్రెస్‌ సబ్ర్‌స్కయిబర్ల సంఖ్య 48 లక్షలు.

ఫేస్‌బుక్‌ టు యూట్యూబ్‌.. వయా వాట్సాప్‌! 
2019 ఎన్నికల్లో డిజిటల్‌ ప్రచారానికి వాట్సాప్‌ ప్రధాన వేదికైంది. అదే సమయంలో నిజానిజాలతో పనిలేకుండా ఫేక్‌ న్యూస్‌ పెరిగిపోవడానికి కూడా ఇది కారణమైంది. వాట్సాప్‌ ద్వారా ఫార్వర్డ్‌ అయ్యే సమాచార ప్రామాణికతను చెక్‌ చేసే యంత్రాంగం లేకపోవడం ఈ మాధ్యమంపై బాగా ప్రతికూల ప్రభావం చూపింది. ఈ ప్రతికూలత ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. 

దీనికి తోడు వాట్సాప్‌లో మెసేజ్‌ ఫార్వార్డ్‌లను 5 యూజర్లకు పరిమితం చేయడం కూడా ఈ ప్లాట్‌ఫాం వినియోగానికి బ్రేక్‌ వేసిందనే చెప్పాలి. పైగా వాట్సాప్‌ ఫార్వార్డ్‌లు లేనిపోని సమస్యలు తెచి్చపెడుతుండటంతో ఈసారి ఎన్నికల ప్రచారంలో యూట్యూబ్‌ కీలక ప్లాట్‌ఫామ్‌గా ఆవిర్భవించిందని కంటెంట్‌ రీసెర్చర్‌ విజేత దహియా చెబుతున్నారు. 

ప్రస్తుతం భారత్‌లో యూట్యూబ్‌కు 50 కోట్ల మందికి పైగా యాక్టివ్‌ యూజర్లుండటం కూడా దీనికి ఊతమిస్తోంది. రాజకీయ విశ్లేషకులు, ప్రభుత్వ విధానాలపై భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేసే విమర్శకులతో పాటు పారీ్టలు కూడా ఏడాదిగా యూట్యూబ్‌లో జోరు పెంచాయి. యూట్యూబ్‌లో తప్పుడు సమాచారాన్ని చెక్‌ చెసే యంత్రాంగం సమర్థంగా పని చేస్తుండటం కూడా పార్టీలు, నేతలు దీనికి అధిక ప్రాధాన్యమిచ్చేందుకు మరో కారణంగా నిలుస్తోంది. 

లైవ్‌ స్ట్రీమ్‌లను, ర్యాలీ వీడియోలను, ఇంటర్వ్యూలను యూజర్లకు చేరువ చేసేందుకు చాలామంది నేతలు తమ సొంత యూట్యూబ్‌ ఛానెల్స్‌ను ప్రారంభించారు. అంతేగాక డిజిటల్‌ ఇన్‌ఫ్లుయెన్సర్లు, పాడ్‌కాస్టర్ల సహకారంతో నేతలు ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నారని రాజకీయ వ్యూహకర్త, డిస్కోర్స్‌ కన్సలి్టంగ్‌ సహ వ్యవస్థాపకుడు తల్హా రషీద్‌ పేర్కొన్నారు. ‘‘దశాబ్దకాలంగా సార్వత్రిక ఎన్నికల్లో పారీ్టల సోషల్‌ ట్రెండ్‌ రకరకాలుగా మారుతోంది. 2014లో ఫేస్‌బుక్‌ పేజీలను, ఈవెంట్లను పారీ్టలు బాగా వాడుకున్నాయి. ఆ ఎన్నిలకప్పుడు పోలింగ్‌ రోజున ఫేస్‌బుక్‌ అలర్టులు సైతం అందించింది’’ అని ఆయన గుర్తు చేశారు.

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

Advertisement
 
Advertisement
 
Advertisement