చికిత్స పొందుతూ రైతు మృతి | Sakshi
Sakshi News home page

Published Wed, Mar 1 2023 8:48 AM

మహేష్‌(ఫైల్‌)  - Sakshi

కామారెడ్డి టౌన్‌: ఆత్మహత్యకు యత్నించిన ఓ యువ రైతు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా.. కామారెడ్డి మండలం లింగాయిపల్లి గ్రామానికి చెందిన దుమాల మహేష్‌(27) సోమవారం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన భూమిని కబ్జా చేశాడని, ధరణిలో తన పేరిట భూమి రాకుండా చేస్తున్నాడని మనస్తా పం చెంది విషం తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. స్థానికులు వెంటనే అతడిని జిల్లా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. అయితే గ్రామానికి చెందిన సదరు వ్యక్తి నుంచి మహేష్‌ తల్లిదండ్రులు సాదాబైనామ ద్వా రా 36 గుంటల భూమి కొనుగోలు చేశారన్నారు. కానీ ఆ భూమి ఇంకా అమ్మిన వ్యక్తి పేరునే ధరణి లో చూపిస్తుందన్నారు. మూడేళ్లుగా ధరణిలో తమ పేరిట మార్చాలని కోరినా చేయడం లేదని, దీంతో మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నం చేసుకున్నారన్నారు. ఈవిషయమై దేవునిపల్లి పోలీసులను వివరణ కోరగా కుటుంబంలో గొడవల కారణంగా మహేష్‌ ఆత్మహత్యాయత్నం చేసినట్టు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసారని ఎస్సై తెలిపారు.

Advertisement
Advertisement