ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ స్థలం విషయంలో వచ్చిన కోర్టు తీర్పు సంచలనంగా మారింది. సినిమా రోడ్ సమీపంలోని అన్నభావు సాఠే విగ్రహం నుంచి మున్సిపల్ కార్యాలయం వైపుగా వెళ్లే రోడ్డుకిరువైపులా బారికేడ్లను ఏర్పాటు చేసి ఈ స్థలం తమదేనంటూ గురువారం ప్లెక్సీని ఏర్పాటు చేయడం కలకలం రేపింది. రాణీసతీజీ కాలనీ సమీపంలోని సాయి పంచవటి హోటల్తో పాటు దానిని ఆనుకుని ఉన్న దుకాణాల స్థలం గతంలో సోమా గంగారెడ్డితో పాటు వారికి సంబంధించినదని అతడి తనయుడు సోమ రవి తెలిపారు. రికార్డుల్లో ఈ భూమి తమ పేరిటే ఉందని తెలిపాడు.
అయితే ఈ స్థలాన్ని గతంలో ఓ వైద్యుడు ఇతరులకు విక్రయించాడని, దీంతో తాము 23ఏళ్లుగా పోరాడుతున్నామని, తాజాగా ఈ భూమిపై అన్ని హక్కులు సోమ గంగారెడ్డి కుటుంబీకులకే ఉన్నట్లుగా కోర్టు ఇచ్చిందని తెలిపాడు. కోర్టు తీర్పు మేరకు 33 గుంటలతో కూడిన ఈ భూమిని తమ అధీనంలోకి తీసుకుని బారికేడ్లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నాడు.
దీంతో పాటు దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు సోమ గంగారెడ్డి అండ్ అదర్స్ అన్ని ప్లెక్సీ ఏర్పాటు చేశాడు. దీనిని గమనించిన వాహనదారులు, పాదచారులు, షాపుల నిర్వాహకులు పెద్ద ఎత్తున అక్కడకు తరలివచ్చారు. షాపుల, హోటల్ నిర్వాహకులు సైతం వెళ్లేందుకు ఇబ్బందులు పడడంతో ఎలాంటి ఘర్షణలు జరుగకుండా ఎస్సై హరిబాబు ఆధ్వర్యంలో సాయుధ పోలీసులు ఉదయం నుంచి రాత్రి వరకూ బందోబస్తు చేపట్టారు.
23 ఏళ్ల తర్వాత కోర్టు సంచలన తీర్పు
Published Sat, Mar 25 2023 11:12 AM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
రెండు బైక్లు ఢీ.. ఇద్దరికి గాయాలు
వరుస చోరీలతో భయాందోళన
ఎన్నికల విధుల సమస్యల పరిష్కారంపై హామీ
గంజాయితో ముగ్గురు యువకుల అరెస్ట్
సుభలయలో కార్డన్సెర్చ్
● జూన్ 4 కోసం అందరి ఎదురుచూపులు ● కాళింగ కార్పొరేషన్ చైర్మన్ దుంపల లక్ష్మణరావు
వైభవంగా అశ్వవాహన సేవ
‘ప్రతి బోటుకు జీపీఎస్ తప్పనిసరి’
కౌంటింగ్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి
మనదేపెత్తనం
తప్పక చదవండి
- కమెడియన్ అని చిన్నచూపు చూడొద్దు..
- ఏఎంసీ.. నో ఏసీ!.. ఇచ్చట ఎవరి ఫ్యాన్లు వారే తెచ్చుకోవలెను
- మోదీ గ్యారంటీలా? కేజ్రీ పథకాలా?.. ఢిల్లీ జనం మదిలో ఏముంది?
- రెప్పపాటులోనే మృత్యు ఒడికి
- ఎమ్మెల్సీ కవితపై చార్జిషీటు
- సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు అరెస్ట్
- చైనా గ్యాంగ్ చెరలో భారతీయులు
- ఐఏఎస్లే ఇన్చార్జులు.. 10 యూనివర్సిటీలకు వీసీలుగా నియమించిన ప్రభుత్వం
- దారి మళ్లనున్న తుపాను!
- పాపం రాహుల్ త్రిపాఠి.. షాక్లో కావ్య మారన్! వీడియో వైరల్
Advertisement