పెళ్లి చేసుకోవాలని వేధించిన వ్యక్తిపై కేసు | Sakshi
Sakshi News home page

పెళ్లి చేసుకోవాలని వేధించిన వ్యక్తిపై కేసు

Published Fri, Apr 21 2023 12:50 AM

-

ఆదిలాబాద్‌టౌన్‌: వివాహితను పెళ్లి చేసుకోమని వేధింపులకు పాల్పడి దాడి చేసిన వ్యక్తిపై టూ టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో గురువారం కేసు నమోదైంది. ఎస్సై విష్ణు ప్రకాశ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్‌ పట్టణంలోని ఇంద్రానగర్‌కు చెందిన ఓ మహిళ భర్తతో గొడవపడి ఏడాది క్రితం తన తల్లిగారి ఊరైన ఇంద్రానగర్‌కు వచ్చి నివాసముంటోంది. ఆమెకు ఇద్దరు పిల్లలున్నారు. ఉపాధి కోసం క్యాటరింగ్‌ సర్వీస్‌లో పనిచేస్తోంది. అక్కడే పనిచేసే ఖుర్షీద్‌నగర్‌కు చెందిన గైక్వాడ్‌ మనోజ్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. భర్తకు విడాకులిచ్చి తనను పెళ్లిచోసుకోవాలని మనోజ్‌ వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో ఆమె అద్దెకుంటున్న ఇంటిని ఖాళీచేసి వెళ్తుండగా బూతులు తిడుతూ ఆమైపె దాడికి పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు టూ టౌన్‌లో ఫిర్యాదు చేయగా కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement