న్యాయం చేయాలని వైస్‌ ఎంపీపీ నిరసన | Sakshi
Sakshi News home page

న్యాయం చేయాలని వైస్‌ ఎంపీపీ నిరసన

Published Thu, Jun 1 2023 2:24 AM

నిరసన వ్యక్తం చేస్తున్న లింబాజీ - Sakshi

బోథ్‌: బోథ్‌ మండల సర్వసభ్య సమావేశం అ నంతరం వైస్‌ ఎంపీపీ లింబాజీ నిరసన వ్య క్తం చేశారు. తాను కాంట్రాక్టు పనికోసం ఎంపీపీ తుల శ్రీనివాస్‌కు రూ. 50 వేలు ఇచ్చాన ని ఆరోపించాడు. సర్వసభ్య సమావేశం ము గిసినట్లు ఎంపీపీ ప్రకటించడంతో లింబాజీ అక్కడే కూర్చున్నాడు. అందరూ వెళ్లి పోయినా.. అరగంట పాటు కూర్చుని నిరసన వ్య క్తం చేశాడు. పోలీసులు వచ్చి అతడిని సమావేశ గది నుంచి బయటకు తీసుకొచ్చారు. త న డబ్బులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కా గా ఎంపీపీ తుల శ్రీనివాస్‌ మాట్లాడుతూ తా ను నాకు డబ్బులు తీసుకోలేదని, ఇదివరకు ఇలాంటి అసత్యపు ఆరోపణలు చేస్తే పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశానన్నాడు.

Advertisement
Advertisement