కళాశాలలో ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ | Sakshi
Sakshi News home page

కళాశాలలో ప్రవేశాలకు కౌన్సెలింగ్‌

Published Sat, Jun 3 2023 12:58 AM

-

ఉట్నూర్‌రూరల్‌: తెలంగాణ గిరిజన గురుకులం ఆధ్వర్యంలో పీవీటీజీ విద్యార్థిని, విద్యార్థుల కోసం హయాత్‌నగర్‌, హైదరాబాద్‌లోని జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం ప్రవేశానికై ఈ నెల 6న మంగళవారం ఉట్నూర్‌ కేబీ ప్రాంగణంలోని గిరిజన బాలికల జూనియర్‌ కళాశాలలో కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు గురుకులాల రీజినల్‌ కోఆర్డినేటర్‌ గంగాధర్‌ శుక్రవారం తెలిపారు. పదోతరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్‌ఈసీ, గ్రూపుల్లో ప్రవేశం పొందుటకై ఉమ్మడి జిల్లాలోని కొలాం, తోటి, మన్నె గిరిజన తెగలకు చెందిన బాల బాలికలు కౌన్సెలింగ్‌కు హాజరు కా వాలన్నారు. ప్రవేశం పొందిన వారికి కళాశాలలో ఉచిత వసతి, భోజనంతో పాటు జేఈ ఈ/ఎన్‌ఈఈటి/ఎంసెట్‌/సిఎల్‌ఎటి కోచింగ్‌ ఇవ్వడం జరుగుతుందన్నారు. టెన్త్‌లో వచ్చిన జీపీఏ మార్కుల ప్రకారం ప్రవేశంలో ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement