ఐకమత్యంతో పనిచేస్తే ఆర్థికాభివృద్ధి | Sakshi
Sakshi News home page

ఐకమత్యంతో పనిచేస్తే ఆర్థికాభివృద్ధి

Published Wed, Sep 6 2023 12:50 AM

వివరాలు తెలుసుకుంటున్న సుశీల  - Sakshi

ఉట్నూర్‌రూరల్‌: ఐకమత్యంతో పనిచేస్తే అర్థికంగా అభివృద్ధి సాధించవచ్చని నాబార్డ్‌ సీజీఎం సుశీల చింతల అన్నారు. మంగళవారం మండలంలోని రాజన్నగూడలో యూఎన్‌ఆర్‌ఎఫ్‌పీసీఎల్‌ గోదాం, కస్టం హైరింగ్‌ సెంటర్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతు సంఘాలు ఏర్పాటు చేసి అభివృద్ధి పథంలో నడవడం అభినందనీయమన్నారు. మారుమూల గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం సంతోషదాయకమన్నారు. రైతు సంఘాన్ని అభినందించారు. రానున్న రోజుల్లో ఇలాగే సంఘాలుగా ఏర్పడి ఒకరికొకరు తోడుగా ఉంటూ.. మరింతగా అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో నాబార్డ్‌ జిల్లా అధికారులు, ధాన్‌ ఫౌండేషన్‌ రాష్ట్ర కోఆర్డినేటర్‌ నిలేశ్‌ రాథోడ్‌, జిల్లా రీజినల్‌ కోఆర్డినేటర్‌ శ్రీకాంత్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement