‘రావణ దహనాన్ని ఆపాలి’ | Sakshi
Sakshi News home page

‘రావణ దహనాన్ని ఆపాలి’

Published Mon, Oct 23 2023 1:18 AM

మాట్లాడుతున్న ఆదివాసీ నాయకులు - Sakshi

ఇంద్రవెల్లి: విజయ దశమి రోజున రావణ దహనాన్ని ఆపాలని ప్రధాన్‌ సంఘం డివిజన్‌ అధ్యక్షుడు సోయం రాందాస్‌ డిమాండ్‌ చేశారు. ఆదివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గోండి సంస్కృతి సంప్రదాయాలను ఆచరించిన మహనీయుడు రావణ్‌ మహారాజ్‌ అని అన్నారు. దహనం చేస్తే సహించేది లేదన్నారు. సమావేశంలో మానవ హక్కుల వేదిక జిల్లా అధ్యక్షుడు కాంబ్లే అతీష్‌కుమార్‌, ప్రధాన్‌ సంఘం మండల అధ్యక్షుడు గేడం భరత్‌, ఆదివాసీ విద్యార్థి సంఘం మండల అధ్యక్షుడు పుర్క చిత్రు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement