Sakshi News home page

బైక్‌ ఢీకొని యువకుడి మృతి

Published Fri, Nov 10 2023 5:36 AM

-

తలమడుగు: బైక్‌ఢీకొని యువకుడు మృతిచెందిన సంఘటన మండలంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. తాంసి మండలంలోని లింమ్‌గుడ గ్రామానికి చెందిన టేకం సోనేరావు(25) దండారీ ఉత్సవాల్లో పాల్గొనేందుకు తలమడుగు మండలంలోని లక్ష్మిపూర్‌ గ్రామానికి నడుచుకుంటూ వస్తున్నాడు. సోనాపూర్‌ గ్రామ సమీపంలో వెనుక నుంచి మహారాష్ట్ర వైపు వెళ్తున్న నాందేడ్‌ జిల్లాకు చెందిన శ్రీకాంత్‌రెడ్డి ద్విచక్ర వాహనంతో ఢీకొన్నాడు. దీంతో తలకు బలమైన గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని రిమ్స్‌కు తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌ తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్సై ధనశ్రీ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement
Advertisement