విభిన్న తీర్పు! ప్రస్తుత ఎన్నికల ట్రెండ్‌పై సర్వత్రా ఆరా.. | Sakshi
Sakshi News home page

విభిన్న తీర్పు! ప్రస్తుత ఎన్నికల ట్రెండ్‌పై సర్వత్రా ఆరా..

Published Sun, Nov 12 2023 12:00 AM

- - Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌: శాసనసభ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో మరికొద్ది రోజుల్లో తేలిపోతుంది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే పార్టీదే ఉమ్మడి జిల్లాలో హవా కొనసాగుతుందా..! లేని పక్షంలో అక్కడ అలా.. ఇక్కడ ఇలా.. అన్నట్లు ప్రతిపక్షాలు అధిక స్థానాల్లో నెగ్గుతాయా.. లేకపోతే అన్ని ప్రధాన పార్టీల ప్రభావం ఉంటుందా.. గతంలో మాదిరి ఇతర పార్టీలు కూడా ఏదైనా ఉనికి చాటుతాయా అనేది సర్వత్రా చర్చనీయాశంగా మారాయి.

గత రెండు ఎన్నికల్లో ఇలా..
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు.. 2014 ఏప్రిల్‌లో జరిగిన ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌(అప్పటి టీఆర్‌ఎస్‌) ప్రభుత్వం ఏర్పడింది. ఆ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఒంటరిగా పోటీ చేయగా, బీజేపీ, టీడీపీ పొత్తులతో బరిలోకి దిగాయి. ఆ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ ఏడు స్థానాల్లో గెలు వగా, అనూహ్యంగా నిర్మల్‌లో అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, సిర్పూర్‌లో కోనేరు కోనప్ప బహుజన్‌ సమా జ్‌ పార్టీ ఏనుగు గుర్తుపై విజయం సాధించారు.

ముథోల్‌లో కాంగ్రెస్‌ నుంచి విఠల్‌రెడ్డి ఏకై క స్థా నంలో గెలుపొందారు. ఆ ఎన్నికల్లో రాష్ట్రంలో అధి కా రంలోకి వచ్చిన బీఆర్‌ఎస్‌ ఉమ్మడి జిల్లాలోనూ ప్ర భావం చూపినప్పటికీ పూర్తి స్థానాలను సాధించలేకపోయింది. అయితే ఐకేరెడ్డి, కొనప్ప, విఠల్‌రెడ్డి బీఆర్‌ఎస్‌లో చేరడంతో అప్పుడే సంఖ్య పెరిగింది. 2018లో జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో తిరిగి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పాటైన విషయం తెలిసిందే.

ఉమ్మడి జిల్లాలో ఏకంగా తొమ్మిది స్థానాల్లో ఈ పార్టీ విజయకేతనం ఎగరవేయగా, ఒక్క ఆసిఫాబా ద్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి ఆత్రం సక్కు గెలుపొందడం ద్వారా ఆ పార్టీ ఉనికి చాటారు. ఆ తర్వాత ఆయన కూడా బీఆర్‌ఎస్‌లో చేరడంతో ఉమ్మడి జిల్లా పూర్తి గా గులాబీమయం అయింది. ఇలా ఆ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన పార్టీకే ఉమ్మడి జిల్లాలోనూ ప్రజలు పట్టం కట్టారు.

అంతకు ముందు ఎన్నికల్లో ఇలా..
సమైక్య రాష్ట్రంలో జరిగిన 2004, 2009 ఎన్నికల సరళిలో భిన్నమైన ఫలితాలు ఉన్నాయి. 2004లో ఉమ్మడి ఆదిలాబాద్‌లో తొమ్మిది శాసనసభ నియోజకవర్గాలు ఉండగా, ఆ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు కాగా ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్‌ ఐదుస్థానాల్లో, బీఆర్‌ఎస్‌ మూడు స్థానాల్లో, టీడీపీ ఒక స్థానంలో గెలుపొందాయి. ఆ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, సీపీఐ, సీపీఎం పార్టీ లు కలిసి పోటీ చేశాయి.

తద్వారా ఉ మ్మడి జిల్లాల ఫలితాల పరంగా రాష్ట్రంలో అధికా రంలోకి వచ్చిన పార్టీలనే జనం ఆదరించారు. ఇక 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా బెల్లంపల్లి నియోజకవర్గం ఏర్పాటుతో ఉమ్మడి జిల్లాలో అసెంబ్లీ స్థానాల సంఖ్య 10కి పెరిగింది. అప్పుడే లక్సెట్టిపేట నియోజకవర్గం మంచిర్యాలగా మార్పు జరిగింది. ఈ ఎన్నికల్లో జిల్లా పరంగా భిన్నమైన ఫలితాలు చోటు చేసుకున్నాయి.

ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా టీడీపీ, బీఆర్‌ఎస్‌లు మహాకూటమిలో చేరి పోటీ చేశాయి. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రాగా ఉమ్మడి ఆదిలా బాద్‌ జిల్లాలో మాత్రం కాంగ్రెస్‌ ఒకే ఒక స్థానం ఆసిఫాబాద్‌లో ఆత్రం సక్కు గెలిచారు. టీడీపీ నాలుగు, బీఆర్‌ఎస్‌ మూడు స్థానాల్లో గెలు పొందగా, అనూహ్యంగా నిర్మల్‌లో ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసిన ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇక మిగిలిన స్థానం బెల్లంపల్లిలో సీపీఐ నుంచి గుండా మల్లేశ్‌ గెలుపొందారు. ఇలా ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో భిన్నమైన ఫలితాలు కనిపించాయి.

Advertisement
Advertisement