ఉమ్మడి జిల్లాలో 3,741 బ్యాలెట్‌ యూనిట్ల వినియోగం | Sakshi
Sakshi News home page

ఉమ్మడి జిల్లాలో 3,741 బ్యాలెట్‌ యూనిట్ల వినియోగం

Published Mon, Nov 20 2023 11:34 PM

-

● ఏడు నియోజకవర్గాల్లో ఒక్కొక్కటి.. ● మూడు చోట్ల రెండేసి..

చెన్నూర్‌: ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని కుమురంభీం, మంచిర్యాల, ఆదిలాబాద్‌, నిర్మల్‌ జిల్లాల్లో ఈ నెల 30న జరిగే పోలింగ్‌లో 3,741 బ్యాలెట్‌ యూ నిట్లను వినియోగించనున్నారు. పది నియోజకవర్గాలు ఉండగా.. ఏడు చోట్ల ఒక్కో బ్యాలెట్‌ యూనిట్‌ ఏర్పాటు చేస్తుండగా.. మూడు చోట్ల 16మంది కంటే ఎక్కువగా అభ్యర్థులు బరిలో ఉండడంతో ఒక్కో పోలింగ్‌ కేంద్రంలో రెండేసి బ్యాలెట్‌ యూనిట్లు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఖారారు

ఉమ్మడి జిల్లాలోని పది నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కేంద్రాలను రాష్ట్ర ఎన్నికల సంఘం ఖరారు చేసింది. సిర్పూర్‌, ఆసిఫాబాద్‌ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని ఆసిఫాబాద్‌లోని తెలంగాణ సోషల్‌ వెల్ఫేర్‌ కళాశాల, మంచిర్యాల జిల్లా హాజీపూర్‌ మండలం ముల్కల్ల గ్రామంలోని ఐజా ఇంజినీరింగ్‌ కళాశాలలో మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్‌ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కేంద్రం, ఆదిలాబాద్‌, బోఽథ్‌ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కేంద్రం టెక్నికల్‌, ట్రైనింగ్‌ సెంటర్‌(టీటీడీసీ) ఆదిలాబాద్‌లో, ఖానాపూర్‌, నిర్మల్‌, ముధోల్‌ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కేంద్రం నిర్మల్‌లోని పాలిట్నెకల్‌ కళాశాలలో ఏర్పాటు చేశారు.

Advertisement
Advertisement