లక్ష్యసాధనకు నిరంతరం కృషి చేయాలి | Sakshi
Sakshi News home page

లక్ష్యసాధనకు నిరంతరం కృషి చేయాలి

Published Wed, Nov 22 2023 12:22 AM

మాట్లాడుతున్న సరస్వతి స్వామి
 - Sakshi

ఆదిలాబాద్‌: విద్యార్థులు తాము నిర్దేశించుకున్న లక్ష్య సాధన కోసం నిరంతరం కృషి చేయాలని శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠాధిపతి యోగానంద సరస్వతి స్వామి అన్నారు. జిల్లా కేంద్రంలోని శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠంలో మంగళవారం శ్రీరామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జీవిత చరిత్రపై పాఠశాల విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామిజీ మాట్లాడుతూ.. స్వామి వివేకానంద భారతదేశ యువతకు గొప్ప మార్గనిర్దేశకుడిగా నిలిచాడన్నారు. నేటి విద్యార్థులు ఆయనను ఆదర్శంగా తీసుకొని ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సమితి అధ్యక్ష, కార్యదర్శులు భూమన్న, లెనిన్‌, హనుమాన్లు తదితరులున్నారు.

Advertisement
Advertisement