వృద్ధుడి మృతి | Sakshi
Sakshi News home page

వృద్ధుడి మృతి

Published Sun, Nov 26 2023 12:10 AM

-

ఆదిలాబాద్‌టౌన్‌: మహారాష్ట్రలోని పాండ్రకవడలోని చినార్లి గ్రామానికి చెందిన చందల్‌వార్‌దేవ్‌గా(72) రిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు టూటౌన్‌ ఎస్సై జీవీ రమణారెడ్డి తెలిపారు. ఆయన వివరాల ప్రకారం... చందల్‌వార్‌దేవ్‌కు ఒక కన్ను సరిగ్గా కనిపించడం లేదు. ఈ క్రమంలో బీడీ వెలిగించుకునే క్రమంలో ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి. గమనించిన కుటుంబీకులు మంటలు ఆర్పివేసి శుక్రవారం జిల్లా కేంద్రంలోని రిమ్స్‌ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి శనివారం మృతి చెందినట్లు ఎస్సై తెలిపాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పాడు.

Advertisement
Advertisement