భారతీయులే | Sakshi
Sakshi News home page

భారతీయులే

Published Sun, Nov 26 2023 12:10 AM

కార్యక్రమంలో మాట్లాడుతున్న డా. సతీశ్‌రెడ్డి - Sakshi

ప్రతిభగల యువకులంతా

భైంసా: ప్రతిభ గల యువకులంతా మన భారతీయులేనని డీఆర్డీవో మాజీ చైర్మన్‌, రక్షణ శాఖ సలహాలదారు డాక్టర్‌ జి.సతీశ్‌రెడ్డి అన్నారు. బాసర ట్రిపుల్‌ఐటీలో నేషనల్‌ సర్వీస్‌స్కీమ్‌ కలాం ఇనిస్టిట్యూషన్‌ ఆఫ్‌ యూత్‌ ఎక్స్‌లెంట్‌ ఫౌండేషన్‌ సంయుక్తంగా ఇంజనీరింగ్‌ విద్యార్థులకు శనివారం నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన ఇంజనీరింగ్‌ విద్యను అందిస్తున్నది ట్రిపుల్‌ఐటీనేనని కొనియాడారు. విద్యార్థులకు సృజనాత్మక ఆలోచనలే పెట్టుబడి అని సూచించారు. 2047 నాటికి ప్రపంచం భారతదేశంవైపు చూసేలా మన యువతలో నైపుణ్యం ఉందన్నారు. గతంలో ఇతర దేశాలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం వెళ్లేవారని ఇప్పుడు ఇతర దేశాలే మన దేశానికి వచ్చి పెట్టుబడులు పెట్టి నూతన సంస్కరణలకు తెరలేపుతున్నాయన్నారు. అబ్దుల్‌కలాం వంటి మహానీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకుని యువత ముందుకువెళ్లాలన్నారు. కార్యక్రమంలో ట్రిపుల్‌ఐటీ ఇన్‌చార్జి వీసీ ప్రొఫెసర్‌ వెంకటరమణ, డైరెక్టర్‌ సతీశ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

పాల్గొన్న విద్యార్థులు
1/1

పాల్గొన్న విద్యార్థులు

Advertisement
Advertisement