బస్సు సౌకర్యం కల్పించాలి | Sakshi
Sakshi News home page

బస్సు సౌకర్యం కల్పించాలి

Published Sat, Dec 16 2023 1:30 AM

డీఎంకు వినతిపత్రం ఇస్తున్న గోవర్ధన్‌రెడ్డి  - Sakshi

ఆదిలాబాద్‌: జిల్లాలోని మారుమూల గ్రామాలకూ ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని డీసీసీబీ డైరెక్టర్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు బాలూరి గోవర్ధన్‌రెడ్డి కోరారు. ఆదిలాబాద్‌ ఆర్టీసీ డీఎం కల్పనను శుక్రవారం కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జైనథ్‌ మండలం లక్ష్మీపూర్‌ నుంచి వయా చాంద (టీ) వరకు గతంలో నడిచిన బస్సును ప్రయాణికుల సౌకర్యార్థం పునరుద్ధరించాలని కోరారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిన నేపథ్యంలో అందరికీ సేవలందేలా చూడాలన్నారు. ఇందుకు సానుకులంగా స్పందించిన డిపో మేనేజర్‌ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు. ఆయన వెంట నాయకులు కొండూరి రవి, చిందం శ్రీధర్‌ తదితరులున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement