20న క్రాస్‌ కంట్రీ పరుగు ఎంపిక పోటీలు | Sakshi
Sakshi News home page

20న క్రాస్‌ కంట్రీ పరుగు ఎంపిక పోటీలు

Published Mon, Dec 18 2023 12:22 AM

-

ఆదిలాబాద్‌: జిల్లా అథ్లెటిక్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఈనెల 20న స్థానిక ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో క్రాస్‌ కంట్రీ పరుగు ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అడ్డి బోజా రెడ్డి, రాజేశ్‌ ప్రకటనలో తెలిపారు. అండర్‌–16,18, 20, పురుషులు, మహిళల విభాగా ల్లో ఎంపిక పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. పాల్గొనే క్రీడాకారులు రూ.50 ఎంట్రీ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. సంబంధిత వయస్సు ధ్రువీకరణ పత్రం, బర్త్‌ సర్టిఫి కెట్‌, ఆధార్‌ కార్డు, ఎస్సెస్సీ మెమోతో ఉద యం 8 గంటలకు స్టేడియంలో రిపోర్టు చేయాలని సూచించారు. వివరాలకు 9492136510 నంబర్‌లో సంప్రదించాలని పేర్కొన్నారు.

‘ప్రజా సమస్యలపై సీపీఐ నిరంతర పోరాటం’

ఎదులాపురం: ప్రజా సమస్యలపై సీపీఐ నిరంతరం పోరాడుతున్నట్లు ఆ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి సిర్ర దేవేందర్‌ అన్నారు. పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లా అభిృద్ధికి ప్రభుత్వం, ప్రతిపక్షం సహకరించాలని కోరారు. ఇందులో జిల్లా కార్యవర్గ సభ్యులు రాములు, దేవిదాస్‌, భాస్కర్‌, పట్టణ కార్యదర్శి అరుణ్‌ కుమార్‌, సీనియర్‌ నాయకులు నర్సింగ్‌రావు, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement