‘కడెం’ను సందర్శించిన స్కాడా బృందం | Sakshi
Sakshi News home page

‘కడెం’ను సందర్శించిన స్కాడా బృందం

Published Wed, Dec 20 2023 12:40 AM

గేట్ల వద్ద పనులను పరిశీలిస్తున్న 
స్కాడా అధికారులు - Sakshi

కడెం: కడెం ప్రాజెక్ట్‌ను స్కాడా(సూపర్‌వైజరీ కంట్రోల్‌ అండ్‌ డేటా ఆక్విషన్‌)ఎక్స్‌పర్ట్‌ రాకేశ్‌బట్‌తో కలిసి బృందం మంగళవారం సందర్శించింది. గతేడాది ప్రారంభించిన స్కాడా సిస్టం పనులను పరిశీలించారు. అనంతరం ప్రాజెక్ట్‌ పాత జనరేటర్‌ రూంలో ఏర్పాటు చేసిన స్కాడా సిస్టం పనితీరును తనిఖీ చేశారు. ప్రాజెక్ట్‌పై స్కాడా పనులు 80 శాతం పూర్తయ్యాయని, గేట్ల మరమ్మతులు పూర్తయ్యాక స్కాడా సిస్టం ప్రారంభిస్తామని ఏఈ ఏఆర్‌ఎన్‌.శర్మ పేర్కొన్నారు. బృందం వెంట డీఈ మాధవి, ఏఈఈ రమాదేవి, ప్రాజెక్టు డీఈ భోజదాసు, ఏఈఈ రవికుమార్‌ ఉన్నారు.

Advertisement
Advertisement