నూతన చట్టాలపై అవగాహన ఉండాలి | Sakshi
Sakshi News home page

నూతన చట్టాలపై అవగాహన ఉండాలి

Published Sun, Dec 24 2023 12:38 AM

-

లక్సెట్టిపేట: ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన చట్టాలపై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జూనియర్‌ సివిల్‌ జడ్జి మహ్మద్‌ అసదుల్లా షరీఫ్‌ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని మున్సిఫ్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు ఆవరణలో శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులకు హాజరై మాట్లాడారు. పార్లమెంటు భారతీయ నాగరిక సురక్ష సన్హిత చట్టాన్ని ఆమోదించిందన్నారు. న్యాయవ్యవస్థలో చాల మార్పులు వస్తాయని, ప్రతిఒక్కరూ వాటి గురించి తెలుసుకోవాలన్నారు. న్యాయవ్యవస్థలో వచ్చిన మార్పులు, చట్టాలను న్యాయవాదులకు వివరించారు. సెక్షన్‌లు, కోడ్‌నంబర్లు కూడా మారుతున్నాయని, వాటిపై పూర్తిస్థాయిలో అవగాహన ఉండాలని సూచించారు. అనంతరం క్రైస్తవ సోదరులతో కలిసి సెమీ క్రిస్‌మస్‌ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమంలో సీనియర్‌ న్యాయవాదులు రాజేశ్వర్‌రావు ఉన్నారు.

Advertisement
Advertisement