నేడు శ్రీకాకుళంలో 3కే రన్‌ | Sakshi
Sakshi News home page

నేడు శ్రీకాకుళంలో 3కే రన్‌

Published Sun, Dec 24 2023 12:50 AM

ఆడుదాం ఆంధ్రా టీషర్టులను యువతతో కలిసి ఆవిష్కరిస్తున్న మెంటాడ స్వరూప్‌   
 - Sakshi

శ్రీకాకుళం న్యూకాలనీ: శ్రీకాకుళంలో ఆదివారం నిర్వహించనున్న 3–కే రన్‌ ర్యాలీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈనెల 26 నుంచి మొదలుకానున్న ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీలకు అధికార యంత్రాంగం, క్రీడావర్గాలు పూర్తిస్థాయిలో ఏర్పాట్లలో నమగ్నమై ఉన్నారు. వాయువేగంగాతో ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం ర్యాలీ జరగనుంది. జిల్లా క్రీడాప్రాధికార సంస్థ, ఒలింపిక్‌ అసోసియేషన్‌, క్రీడాసంఘాలు, యువత, క్రీడాకారులతో కలిసి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ యువజన విభాగం అధ్యక్షుడు మెంటాడ స్వరూప్‌ ఆధ్వర్యంలో ఆడుదాం ఆంధ్రాకు సంఘీభావంగా ర్యాలీ జరగనుంది. ప్రభుత్వ పురుషుల డిగ్రీ (ఆర్ట్స్‌) కళాశాల నుంచి అంబేడ్కర్‌ జంక్షన్‌, డే అండ్‌ నైట్‌ జంక్షన్‌, పాలకొండ రోడ్‌, కృష్ణాపార్క్‌ మీదుగా వైఎస్సార్‌ సర్కిల్‌ వరకు ర్యాలీ జరగనుంది. ఆర్ట్స్‌ కాలేజ్‌ వద్ద ఉదయం ఆరున్నర గంటలకు మొదలయ్యే ర్యాలీకి ముఖ్యఅతిథులుగా రాష్ట్ర మంత్రి ధర్మాన ప్రసాదరావు, స్పీకర్‌ తమ్మినేని సీతారాం, ఒలింపిక్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్‌, అధికారులు హాజరవుతున్నారని మెంటాడ స్వరూప్‌ శనివారం తెలిపారు. కాగా ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీల టీషర్టులను మండలవీధిలో ఉన్న తన నివాసంలో మెంటాడ స్వరూప్‌ ఆవిష్కరించారు. కార్యక్రమంలో బరాటం సంతోష్‌, సింహాద్రి శ్రీను, మట్ట నగేష్‌, రాజ్‌, పొట్నూరు గోవింద్‌, ఇప్పిలి సతీష్‌, భోగి నాగరాజు, అందవరపు సతీష్‌, వరదాన శివకుమార్‌, కనపల తేజేశ్వరరావు, ఇలియాస్‌ హుస్సేన్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement