బ్యాటరీ దొంగల అరెస్ట్‌ | Sakshi
Sakshi News home page

బ్యాటరీ దొంగల అరెస్ట్‌

Published Wed, Jan 31 2024 11:36 PM

వివరాలు వెల్లడిస్తున్న పట్టణ సీఐ
పురుషోత్తం, పక్కన ఎస్సై శంకర్‌ 
 - Sakshi

నిర్మల్‌టౌన్‌: జిల్లా కేంద్రంలో కొంతకాలంగా బ్యాటరీ దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. బుధవారం పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఐ పురుషోత్తం వివరాలు వెల్లడించారు. స్థానిక గాంధీనగర్‌లో వాహనాల బ్యాటరీలను గుర్తు తెలియని వ్యక్తులు దొంగలిస్తున్నారని అందిన సమచారం మేరకు ఇటీవల కేసు నమోదు చేశారు. మంగళవారం రాత్రి పట్టణంలో పోలీసులు పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్న సమయంలో నిందితులు చూసి తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఆటోను ఆపి తనిఖీ చేయగా అందులో ఆరు బ్యాటరీలు కనిపించాయి. వారిని విచారించగా పట్టణానికి చెందిన షాహీద్‌, సల్మాన్‌లు గతకొంత కాలంగా పలుచోట్ల బ్యాటరీలు దొంగతనం చేసి నిజామాబాద్‌లో విక్రయించేందుకు తీసుకెళ్తున్నామని ఒప్పుకున్నారు. వీరి వద్ద నుంచి ఆరు బ్యాటరీలు, ఆటోను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలింలించినట్లు తెలిపారు. నిందితులను పట్టుకున్న ఎస్సై శంకర్‌, ఐడీ పార్టీ పోలీసులను సీఐ అభినందించారు.

Advertisement
Advertisement