నిప్పంటుకుని వృద్ధురాలి మృతి | Sakshi
Sakshi News home page

నిప్పంటుకుని వృద్ధురాలి మృతి

Published Wed, Jan 31 2024 11:36 PM

-

ఆదిలాబాద్‌రూరల్‌: మండలంలోని అంకోలి గ్రామానికి చెందిన మందుల గంగమ్మ (68) ప్రమాదవశాత్తు నిప్పంటుకుని చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందినట్లు ఎస్సై ముజాహిద్‌ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. గంగమ్మకు ఒక కుమారుడు ఉన్నారు. ఆయన పెళ్లి చేసుకుని భార్యతో కలిసి వేరుగా నివాసముంటున్నాడు. గంగమ్మ భర్త గతంలో చనిపోవడంతో ఒంటరిగా నివాసం ఉంటూ వ్యవసాయ కూలీ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తోంది. జనవరి 27న ఆమె ఇంట్లో దేవుడి గుడిలో దీపం ముట్టించింది. దీపం ఒంటిపై ఉన్న కొంగుకు అంటుకుంది. దీంతో ఆమెకు గాయలు కావడంతో చికిత్స కోసం జిల్లా కేంద్రంలోని రిమ్స్‌ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

Advertisement
Advertisement