‘బీజేపీది సర్వనాశన సంకల్పయాత్ర’ | Sakshi
Sakshi News home page

‘బీజేపీది సర్వనాశన సంకల్పయాత్ర’

Published Thu, Feb 22 2024 1:52 AM

మాట్లాడుతున్న ప్రభాకర్‌ రెడ్డి - Sakshi

ఎదులాపురం: బీజేపీ తలపెట్టింది విజయ సంకల్ప యాత్ర కాదని, సర్వనాశన సంకల్ప యాత్ర అని సీపీఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్‌ రెడ్డి ప్రభాకర్‌ రెడ్డి విమర్శించారు. జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం విలేకరులతో మాట్లాడారు. మోదీ ప్రధా ని అయిన తర్వాత దేశంలో రైతు, కార్మిక పోరా టాలు, ఆందోళనలు పెరిగాయన్నారు. కార్పొరేట్లకు పెద్దపీట వేస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తున్నారని విమర్శించా రు. అలాగే రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేకుండా పోయిందన్నారు. బండి సంజయ్‌ సంకల్ప యాత్రలో భాగంగా ఏ ముఖం పెట్టుకొని జిల్లాకు వస్తున్నారని ప్రశ్నించారు. సిమెంట్‌ ఫ్యాక్టరీ, ఎయిర్‌ఫోర్టు నిర్మాణం, ఆదిలాబాద్‌–ఆర్మూర్‌ రైల్వేలైన్‌, గిరి జన వర్సిటీ జిల్లాకు తీసుకొచ్చారా అని ప్రశ్నించారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర సమితి సభ్యులు నళినిరెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు రాములు, ఎస్‌.అరుణ్‌ కుమార్‌, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రమేశ్‌, గణేశ్‌, మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అమీనాఖాన్‌, గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు పోచారం తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement