అలేఖ్య కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి | Sakshi
Sakshi News home page

అలేఖ్య కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి

Published Sun, Mar 24 2024 12:35 AM

బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తున్న సీతక్క  - Sakshi

ఖానాపూర్‌: ఇటీవల పట్టణంలో పట్టపగలు ప్రేమోన్మాది చేతిలో నడిరోడ్డుపై హత్యకు గురైన అలేఖ్య కుటుంబాన్ని శనివారం జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క పరామర్శించారు. పట్టణంలోని అంబేద్కర్‌నగర్‌ కాలనీలోని బాధితురాలి నివాసానికి ఎమ్మె ల్యే వెడ్మ బొజ్జుపటేల్‌తో వెళ్లి ఘటనలో తీవ్రంగా గాయపడ్డ జయశీలతో పాటు అలేఖ్య కుటుంబీకుల ను పరామర్శించారు. చట్టప్రకారం నిందితులపై చ ర్యలు తీసుకుంటమన్నారు. నిందితులకు శిక్షపడేలా చూస్తామని, ఈ విషయమై ఘటన జరిగిన నాటి నుంచే తాను సంబంధిత అధికారులతో మాట్లాడుతున్నానని, తగు చర్యలకు ఆదేశించానని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ చిన్నం సత్యం, నాయకులు దయానంద్‌, నిమ్మల రమేశ్‌, షబ్బీర్‌పాషా, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఉన్నారు.

Advertisement
Advertisement