‘ప్రధాని మోదీకి కానుకగా ఇవ్వాలి’ | Sakshi
Sakshi News home page

‘ప్రధాని మోదీకి కానుకగా ఇవ్వాలి’

Published Tue, Apr 23 2024 8:45 AM

మాట్లాడుతున్న గోడం నగేష్‌ - Sakshi

బజార్‌హత్నూర్‌: లోకసభ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి ఆదిలాబాద్‌ పార్లమెంటు సీటును ప్రధాని నరేంద్ర మోదీకి కానుకగా ఇవ్వాలని ఆదిలాబాద్‌ బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడం నగేష్‌ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోదీని మూడోసారి ప్రధానమంత్రిని చేయాల్సిన బాధ్యత యువతపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పతంగే బ్రహ్మనంద్‌, ప్యాక్స్‌ చైర్మన్‌ మేకల వెంకన్న, వైస్‌ ఎంపీపీ పోరెడ్డి శ్రీనివాస్‌, ఎంపీటీసీ ఈశ్వర్‌, నాయకులు అల్కే గణేశ్‌, నానం రమణ, ఎట్టం రాములు, భోజారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement