ఆదిలాబాద్రూరల్: బీజేపీ ఆదిలాబాద్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని సోమవారం ప్రారంభించారు. మావల మండల పరిధి దుర్గానగర్లో గల దుర్గాదే వి ఆలయంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్, పార్టీ ఎంపీ అభ్యర్థి నగేశ్ ప్రచార రథాలకు పూజలు నిర్వహించి వాహనాలను ప్రారంభించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానంద్, మాజీ మంత్రి అమర్సింగ్ తిలావత్, పార్లమెంట్ కోఇన్చార్జి అశోక్ ముస్తాపురే, పార్లమెంట్ కోకన్వీనర్ మయూ ర్ చంద్ర, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ప్రచార రథాలకు పూజలు చేస్తున్న
ఎమ్మెల్యే శంకర్, ఎంపీ అభ్యర్థి నగేశ్