‘మోదీని మళ్లీ ప్రధాని చేయడమే కర్తవ్యం’ | Sakshi
Sakshi News home page

‘మోదీని మళ్లీ ప్రధాని చేయడమే కర్తవ్యం’

Published Tue, Apr 23 2024 8:45 AM

మాట్లాడుతున్న ఎంపీ అభ్యర్థి నగేశ్‌ - Sakshi

ఆదిలాబాద్‌టౌన్‌: మోదీని మరోసారి ప్రధాని చేయడమే ముందున్న కర్తవ్యమని బీజేపీ నాయకులు అన్నారు. పట్టణంలోని ఓ హోటల్‌లో మహిళ శక్తి సమ్మేళనం సో మవారం నిర్వహించారు. కార్యక్రమానికి పార్లమెంట్‌ పొలిటికల్‌ ఇన్‌చార్జి పాయల్‌ శంకర్‌, ఎంపీ అభ్యర్థి గొడం నగేశ్‌, జెడ్పీ మాజీ చైర్‌ పర్సన్‌ చిట్యాల సుహాసిని రెడ్డి, పార్లమెంట్‌ ప్రభారి అల్జాపుర్‌ శ్రీనివాస్‌, పార్లమెంట్‌ కన్వీనర్‌ అయ్యన్నగారి భూ మయ్య తదితరులు హా జరై మాట్లాడారు. మహిళలు అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదన్నారు. ప్రధాని మోదీ మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ ఎ న్నికల్లో ఎంపీగా నగేశ్‌ను గెలిపించాలని కోరా రు. ఇందులో ఇంద్రవెల్లి జెడ్పీటీసీ పుష్పలత, నాయకురాలు దోని జ్యోతి, అనిత, నివేదిత వఝే తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement