ఘాట్‌ రోడ్డులో అడ్డంగా నిలిచిన లారీ | Sakshi
Sakshi News home page

ఘాట్‌ రోడ్డులో అడ్డంగా నిలిచిన లారీ

Published Fri, Mar 24 2023 6:24 AM

పాడేరు ఘాట్‌లో రోడ్డుకు అడ్డంగా నిలిచిన లారీ  - Sakshi

రాకపోకలకు అవస్థలు

సాక్షి,పాడేరు: మైదాన ప్రాంతానికి వెళ్లే ప్రధాన ఘాట్‌రోడ్డులోని యేసు ప్రభువు విగ్రహం ఉన్న మలుపులో భారీ లారీ మళ్లీ సాంకేతిక కారణాలతో రోడ్డుకు అడ్డంగా నిలిచిపోయింది. మైదాన ప్రాంతం నుంచి లోడ్‌తో వస్తున్న భారీ వాహనం ఈ మలుపు ఎక్కలేక మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో మొరాయించి ఆగిపోయింది. బస్సులు, లారీలు, భారీ వాహనాలు ఇరువైపులా నిలిచిపోయాయి. కార్లు, జీపులు, ఆటోలు మాత్రమే రాకపోకలు సాగించాయి. ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ఆర్టీసీ అధికారులు ఇరువైపులా బస్సులను నిలిపి ప్రయాణికులను తరలించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. లారీని అడ్డంగా తీసే పనులు కొనసాగుతున్నాయి.

Advertisement
Advertisement