108 వాహనంలో ప్రసవాలు | Sakshi
Sakshi News home page

108 వాహనంలో ప్రసవాలు

Published Wed, Nov 15 2023 1:48 AM

చామంతి, ఆమె బిడ్డతో 108 సిబ్బంది  - Sakshi

పెదబయలు: ఒకే 108వాహనంలో వేర్వేరు ప్రాంతా ల్లో ఇద్దరు గర్భిణులు ప్రసవించారు. మండలంలోని అరడకోట పంచాయతీ చెరువువీధి గ్రామానికి చెందిన బొండా గీత అనే గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో 108 వాహనానికి మంగళవారం ఉదయం కుటుంబ సభ్యులు ఫోన్‌ చేశారు. సిబ్బంది ఆమెను ముంచంగిపుట్టు ఆస్పత్రి తరలిస్తుండగా నొప్పులు ఎక్కువై మార్గమధ్యంలో ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. ఆమెకు ఇది మొదటి కాన్పు. తల్లీబిడ్డలను ముంచంగిపుట్టు ఆస్పత్రిలో చేర్పించారు. వారు క్షేమంగా ఉన్నా రు. మంగళవారమే పెదబయలు మండలం బొండాపల్లి పంచాయతీ చంపాపుట్టు గ్రామానికి చెందిన వంతాల చామంతి అనే గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో అదే 108 వాహనంలో ఆస్పత్రికి తరలిస్తుండగా కుజభంగి జంక్షన్‌ సమీపంలో ప్రసవించింది. ఈఏన్‌టీ వి.రవి, సతీష్‌ కాన్పు చేసి, ముంచంగిపుట్టు ఏరియా ఆస్పత్రికి తరలించారు. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారు.

చెరువువీధి గ్రామానికి చెందిన బొండా గీత, ఆమె బిడ్డతో 108 సిబ్బంది
1/1

చెరువువీధి గ్రామానికి చెందిన బొండా గీత, ఆమె బిడ్డతో 108 సిబ్బంది

Advertisement
Advertisement