ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యం | Sakshi
Sakshi News home page

ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యం

Published Wed, Nov 15 2023 1:48 AM

పార్టీజెండాను ఆవిష్కరిస్తున్న 
అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ  - Sakshi

అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ

డుంబ్రిగుడ: ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందించడమే వైఎస్సార్‌ సీపీ లక్ష్యమని అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ అన్నారు. మంగళవారం స్థానిక గ్రామ సచివాలయ ఆవరణంలో మా నమ్మకం నువ్వే జగనన్న కార్యక్రమానికి సంబంధించి సంక్షేమ, అభివృద్ధి క్యాలెండర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందించిన ఘనత సీఎం సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందన్నారు. ప్రజా సంక్షేమమే పరమావధిగా సుపరిపాలన అందిస్తున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ మద్దతు తెలిపి, మరలా జగన్‌ను ముఖ్యమంత్రిగా గెలిపించాలని ప్రజలను కోరారు. గ్రామాల్లో ఎటువంటి సమస్యలున్నా, తన దృష్టికి తీసుకు రావాలని కోరారు. ఎంపీపీ బాక ఈశ్వరి, జెడ్పీటీసీ సభ్యురాలు జానకమ్మ, ఎంపీడీవో ఉషారాణి, పార్టీ మండలాధ్యక్షుడు మల్లేశ్వరరావు, పార్టీ మహిళా విభాగం మండల అధ్యక్షురాలు శాంతి, సర్పంచ్‌ వెంకటరావు, పార్టీ ఉపాధ్యక్షులు జగ్గునాయుడు, గణపతి, వైస్‌ ఎంపీపీ లలిత, ఆనందరావు, మాజీ జెడ్పీటీసీ శ్రీరాములు, సీనియర్‌ నాయకులు బాక సింహాచలం, గోపాల్‌, కృష్ణారావు, వినోద్‌, లింగు, బబిత పాల్గొన్నారు.

Advertisement
Advertisement