కేజీహెచ్‌ సేవలు భేష్‌ | Sakshi
Sakshi News home page

కేజీహెచ్‌ సేవలు భేష్‌

Published Wed, Nov 15 2023 1:48 AM

- - Sakshi

మహారాణిపేట(విశాఖ): ఉత్తరాంధ్రతో పాటు ఒడిశాకు పెద్ద దిక్కుగా ఉన్న కేజీహెచ్‌ను ప్రభుత్వం పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి రోగులకు మెరుగైన వైద్య సేవలందిస్తోందని వైఎస్సార్‌సీపీ నాయకుడు, మాజీ మంత్రి పి.బాలరాజు అన్నారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ ఎస్‌.ఎ.రహ్మాన్‌తో కలిసి ఆయన మంగళవారం కేజీహెచ్‌ను సందర్శించారు. కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న పాడేరుకు చెందిన పలువురు రోగులను పరామర్శించారు. అనంతరం కేజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ పి.అశోక్‌కుమార్‌, డాక్టర్‌ రాంబాబులను దుశ్శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా కేజీహెచ్‌లో కల్పించిన సదుపాయాల పట్ల బాలరాజు, డాక్టర్‌ రహ్మాన్‌ సంతృప్తి వ్యక్తం చేసి సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement
Advertisement