ఇద్దరికి తీవ్ర గాయాలు | Sakshi
Sakshi News home page

ఇద్దరికి తీవ్ర గాయాలు

Published Sat, Dec 2 2023 1:46 AM

గాయపడిన లైన్‌మెన్‌ సహాయకుడు వెంకటరమణ - Sakshi

చింతపల్లి రూరల్‌: మండలంలో శుక్రవారం జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మండల కేంద్రంలో విద్యుత్‌ లైన్ల మరమ్మతుల నిమిత్తం స్తంభం ఎక్కిన లైన్‌మెన్‌ సహాయకుడు సురగాం వెంకటరమణ విద్యుత్‌ షాక్‌ గురై తీవ్రంగా గాయపడ్డాడు. అదేవిధంగా గూడెం కొత్తవీధి రంపులకు చెందిన పాంగి సందిప్‌(9) అనే బాలుడు చెట్టు ఎక్కి ప్రమాదవశాత్తు జారిపడి తీవ్రంగా గాయపడ్డాడు. వీరిద్దరికి స్థానిక ఏరియా ఆస్పత్రిలో వైద్యులు ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యానికి నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు.

Advertisement
Advertisement