రేంజ్‌ పరిధిలో 78 మంది పోలీస్‌ సిబ్బంది బదిలీ | Sakshi
Sakshi News home page

రేంజ్‌ పరిధిలో 78 మంది పోలీస్‌ సిబ్బంది బదిలీ

Published Sat, Dec 2 2023 1:46 AM

వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా ఎస్పీ మురళీకృష్ణ - Sakshi

అల్లూరి జిల్లా నుంచి అనకాపల్లి జిల్లాకు..

సాక్షి, అనకాపల్లి: విశాఖ రేంజ్‌ పరిధిలో 78 మంది పోలీస్‌ కానిస్టేబుళ్లు బదిలీ అయ్యారు. ఏజెన్సీ ప్రాంతం(అల్లూరి జిల్లా)లోని వివిధ పోలీసు స్టేషన్లు, ప్రత్యేక విభాగాల్లో పనిచేస్తున్న ఇద్దరు ఏఎస్‌ఐలు, 45 మంది హెడ్‌ కానిస్టేబుళ్లు, 31 మంది కానిస్టేబుళ్లను అనకాపల్లి జిల్లాకు బదిలీ చేస్తూ శుక్రవారం ఉత్వర్వులు జారీ చేశారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు స్పౌజ్‌, మెడికల్‌ కేటగిరీకి ప్రాధాన్యతనిచ్చి, అత్యంత పారదర్శకంగా బదిలీలు నిర్వహించినట్లు అనకాపల్లి జిల్లా ఎస్పీ మురళీకృష్ణ వెల్లడించారు. ఏజెన్సీలో దీర్ఘకాలంగా పనిచేస్తున్నవారికి, ఆనారోగ్య సమస్యలున్నవారికి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కానిస్టేబుల్‌ నుంచి ఏఎస్‌ఐ స్థాయి వరకు సిబ్బంది వినతులను స్వీకరించి బదిలీ చేశారు. అదనపు ఎస్పీ(పరిపాలన) బి.విజయభాస్కర్‌, దిశ డీఎస్పీ మళ్ల మహేశ్వరరావు, డీపీవో ఏవో బి.శారద, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
Advertisement