మత్స్యగెడ్డలో గల్లంతైనవ్యక్తి మృతి | Sakshi
Sakshi News home page

మత్స్యగెడ్డలో గల్లంతైనవ్యక్తి మృతి

Published Thu, Dec 7 2023 1:10 AM

రామకృష్ణ మృతదేహం 
 - Sakshi

సాక్షి,పాడేరు: మత్స్యగెడ్డ ఒడ్డున చేపలు వేటాడుతూ ప్రమాదవశాత్తు గెడ్డలో జారిపడి కొట్టుకుపోయి గిరిజనుడి మృతదేహం లభ్యమైంది. పెదబయలు మండలం పెదాకోడాపల్లి పంచాయతీ, పరదానిపుట్టు గ్రామ సమీపంలోని మత్స్యగెడ్డ వద్ద బుధవారం మధ్యాహ్నం ఈ ప్రమాద సంఘటన చోటుచేసుకుంది. పరదానిపుట్టు గ్రామానికి చెందిన గిరిజనుడు కిల్లో రామకృష్ణ(40) మరొకరితో కలిసి మత్స్యగెడ్డ వద్దకు చేపలవేటకు వెళ్లాడు. గెడ్డ ఒడ్డు నుంచి వలతో చేపలు పడుతుండగా ఒక్కసారిగా గెడ్డలో జారి పడి గల్లంతయ్యాడు.గెడ్డ ప్రవాహం అధికంగా ఉన్నప్పటికి గ్రామంలో గిరిజనులు గాలింపు చర్యలు చేపట్టారు.సాయంత్రానికి రామకృష్ణ మృతదేహం ఒడ్డుకు కొట్టుకువచ్చింది.ఈ సంఘటనతో పరదానిపుట్టు గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి.మృతుడు రామకృష్ణకు భార్య,ఇద్దరు పిల్లలు ఉన్నారు.రామకృష్ణ మృతిపై అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ విచారం వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement