అనారోగ్యంతో కేజీబీవీవిద్యార్థిని మృతి | Sakshi
Sakshi News home page

అనారోగ్యంతో కేజీబీవీవిద్యార్థిని మృతి

Published Mon, Dec 11 2023 1:12 AM

కమల (ఫైల్‌)  
 - Sakshi

జి.మాడుగుల: స్థానిక కస్తూర్బా విద్యాలయానికి చెందిన విద్యార్థిని పాంగి కమల అనారోగ్యంతో మృతి చెందింది. ఏడవ తరగతి చదువుతున్న ఈమె చర్మ వ్యాధితో బాధపడుతుండగా పాఠశాల యాజమాన్యం స్థానిక పీహెచ్‌సీలో వైద్యం అందించింది. అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు అక్టోబర్‌లో మండలంలోని స్వగ్రామం నక్కమెట్టకు ఆమెను తీసుకువెళ్లిపోయారు. దసరా తరువాత కూడా ఆమె పాఠశాలకు రాలేదు. విపరీతమైన దగ్గు, గుండెల్లో మంట లక్షణాలతో బాధపడుతున్న ఆమెను శుక్రవారం పాడేరు ఆస్పత్రికి తీసుకువెళ్లగా వైద్య పరీక్షలు నిర్వహించారు. గుండెకు రంధ్రం ఉన్నందున విశాఖ కేజీహెచ్‌కు తీసుకువెళ్లాలని తల్లిదండ్రులకు వైద్యులు సూచించారు. ఇందుకు అవసరమైన డబ్బులు సమకూర్చుకునేందుకు అక్కడి నుంచి విద్యార్థినితో తల్లిదండ్రులు రాజారావు, రాజులమ్మ స్వగ్రామం నక్కమెట్ట వచ్చారు. ఇంతలోనే విద్యార్థిని ఆరోగ్య విషమించడంతో ఆదివారం ఇంటివద్దనే విద్యార్థిని కమల మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.

Advertisement
Advertisement