అమ్మవారికి బోనాల సమర్పణ | Sakshi
Sakshi News home page

అమ్మవారికి బోనాల సమర్పణ

Published Sat, Dec 16 2023 1:30 AM

-

యలమంచిలి రూరల్‌: మార్గశిర మాసం తొలి శుక్రవారం నాడు వందలాది మంది మహిళా భక్తులు అమ్మవారికి ఘనంగా బోనాలు, సారె సమర్పించారు. పట్టణ వీధుల్లో బోనాలు, సారెను మంగళవాద్యాల నడుమ ఊరేగించి, అమ్మవారి ఆలయానికి వెళ్లారు. అక్కడ ప్రత్యేక హారతులు, అమ్మవారికి అభిషేకాలు, పసుపు,కుంకుమలు సమర్పించారు. బోనాల్లో ఉన్న నైవేద్యాలను అమ్మవారికి సమర్పించారు. బోనాల ఊరేగింపు సందర్భంగా మహిళలు,బాలికలు కోలాటమాడారు.ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. పలువురు మహిళలు అమ్మవారికి చీర,గాజులు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.

Advertisement
Advertisement