నేడు విశ్వేశ్వరరాజు నామినేషన్‌ | Sakshi
Sakshi News home page

నేడు విశ్వేశ్వరరాజు నామినేషన్‌

Published Fri, Apr 19 2024 2:05 AM

- - Sakshi

సాక్షి,పాడేరు: పాడేరు అసెంబ్లీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మత్స్యరాస విశ్వేశ్వరరాజు శుక్రవారం నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. ఉదయం 10 గంటలకు పట్టణంలోని మోదకొండమ్మ ఆలయం నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలతో పాదయాత్రగా వెళ్లి ఆర్‌వో కార్యాలయంలో నామినేషన్‌ సమర్పిస్తారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలో అన్ని మండలాల నుంచి వైఎస్సార్‌సీపీ శ్రేణులు భారీగా తరలిరానున్నా యి. పాడేరు ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షురాలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, అరకు పార్లమెంట్‌ అభ్యర్థి డాక్టర్‌ గుమ్మా తనూజరా ణి, ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర, అరకు ఎంపీ, ఎమ్మెల్యేలు గొడ్డేటి మాధవి, చెట్టి పాల్గుణ, ఎమ్మెల్సీ కుంభా రవిబాబు, జీసీసీ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ శోభ స్వాతిరాణి, మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, ఎస్టీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షురాలు మత్స్యరాస వెంకటలక్ష్మి, పాడేరు, అరకు పార్టీ పరిశీలకులు శ్రీకాంత్‌రాజు, పీలా వెంకటలక్ష్మి, శోభా హైమావతిదేవి, అన్నిమండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని పార్టీ వర్గాలు

తెలిపాయి.

పాదయాత్రగా వెళ్లి సమర్పించేలా

ఏర్పాట్లు

భారీగా తరలిరానున్న

వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు

Advertisement
Advertisement