ఆలయం వద్ద చైన్‌ స్నాచింగ్‌ | Sakshi
Sakshi News home page

ఆలయం వద్ద చైన్‌ స్నాచింగ్‌

Published Wed, Mar 22 2023 2:28 AM

-

నర్సీపట్నం : పట్టణంలోని నూకాలమ్మ ఆలయం వద్ద అమ్మవారి దర్శనానికి వచ్చిన మహిళ మెడలో గుర్తు తెలియని వ్యక్తి చైన్‌ స్నానింగ్‌కు పాల్పడ్డాడు. బాధితురాలి కథనం ప్రకారం వివరాలివి. మున్సిపాలిటీ పరిధి వెంకునాయుడుపేటకు చెందిన పి.సత్యవతి అమ్మవారిని దర్శించుకునేందుకు అబిద్‌సెంటర్‌లోని ఆలయానికి వచ్చారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడాన్ని గమనించిన గుర్తు తెలియని వ్యక్తి ఆమె మెడలో బంగారు గొలుసు తెంపుకొని పరారయ్యాడు. మూడున్నర తులాల బంగారం తాడు పోవడంతో ఆమె లబోదిబోమంటున్నారు. గట్టి బందోబస్తు ఉన్నప్పటికీ అమ్మవారి ఆలయం వద్ద చైన్‌ స్నానింగ్‌ జరగడం పట్ల భక్తులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై పోలీసులను సంప్రదించగా తమకు ఎటువంటి ఫిర్యాదు రాలేదంటున్నారు.

Advertisement
Advertisement