నర్సీపట్నం: డీసీసీబీ డైరెక్టర్గా అంకంరెడ్డి పార్వతిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్టు డీసీసీబీ చైర్పర్సన్ చింతకాయల అనిత తెలిపారు. నాతవరం మండలానికి చెందిన వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు అంకంరెడ్డి జమీలు డీసీసీబీ డైరెక్టర్గాపనిచేస్తూ ఇటీవల మరణించారు. జమీలు స్థానంలో ఆయన సతీమణి పార్వతిని డీసీసీబీ డైరెక్టర్గా నియమిస్తూ కార్పొరేషన్ అండ్ రిజిస్ట్రార్ ఆఫ్ కో–ఆపరేటివ్ సొసైటీ ప్రిన్సిపల్ సెక్రటరీ చిరంజీవి చౌదరి ఉత్తర్వులు జారీ చేశారని తెలిపారు.
పార్టీ కోసం పనిచేసేవారికి గుర్తింపు
అంకంరెడ్డి జమీలు స్థానంలో ఆయన సతీమణి పార్వతిని డీసీసీబీ డైరెక్టర్గా నియమిస్తూ ప్రభుత్వం తగిన గుర్తింపు ఇచ్చిందని ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ అన్నారు. జమీలు మరణించిన వెంటనే నాతవరం పీఏసీఎస్ పర్సన్ ఇన్చార్జిగా పార్వతిని నియమించామన్నారు. డీసీసీబీ డైరెక్టరుగా అవకాశమివ్వాలని వ్యవసాయశాఖ మంత్రిని కోరామని, మొదట్లో సాంకేతిక సమస్య కారణంగా, తర్వాత ఎన్నికల కోడ్ కారణంగా కొంత జాప్యం జరిగినా.. చివరకు న్యాయం జరిగిందన్నారు. జమీలు కుటుంబానికి సీఎం జగన్మోహన్రెడ్డి తగిన గుర్తింపు ఇచ్చారన్నారు. పార్టీ కోసం పనిచేసే వారికి గుర్తింపు ఉంటుందన్నారు.