తుమ్మపాల : జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుతో యువతకు ఉపాధి పెరిగి, గ్రామాలు ఆర్థికంగా బలోపేతమవుతాయని కలెక్టర్ రవిపట్టాన్శెట్టి అన్నారు. కలెక్టరేట్లో శుక్రవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో 160 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు లక్ష్యంగా కృషి చేస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికే 53 యూనిట్ల నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయన్నారు. జిల్లాలో గుర్తించిన 82 గ్రామాలలో ఫిష్ ఫుడ్ ప్రాసెసింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. ప్రధానమంత్రి మత్స్య సంయోజన పథకంలో భాగంగా యూనిట్ వ్యయంలో 40 శాతం కేంద్ర ప్రభుత్వం భరిస్తుందన్నారు. కన్వర్జెన్సీ ఫండ్గా 30 శాతం మంజూరుకానున్నట్టు పేర్కొన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ కేంద్రాల నిర్మాణంతో మంచి ఆదాయం సమకూరుతుందన్నారు. రైతులకు గిట్టుబాటు ధరతో పాటు నిరుద్యోగులకు ఉపాధి కలుగుతుందన్నారు. జిల్లా ఉద్యానశాఖ అధికారి ప్రభాకరరావు, మత్స్యశాఖ అధికారి లక్ష్మణరావు, పశుసంవర్థక శాఖ జేడీ ప్రసాదరావు, లీడ్ బ్యాంకు మేనేజర్ సత్యనారాయణ, డీఆర్డీఏ ఏపీడీ డైసీ తదితరులు పాల్గొన్నారు.
ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లతో యువతకు ఉపాధి
Published Sat, Mar 25 2023 2:08 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
Advertisement