Student Commits Suicide After Lost In Cricket Betting, Details Inside - Sakshi
Sakshi News home page

బెట్టింగ్‌లో భారీ నష్టం.. అయ్యో మధు!

Published Wed, Apr 26 2023 12:02 PM

- - Sakshi

అనకాపల్లిటౌన్‌: క్రికెట్‌ బెట్టింగ్‌లో నష్టపోయిన విద్యార్థి పి.మధు ఆత్మహత్యకు పాల్పడగా విశాఖ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్టు రూరల్‌ ఎస్‌ఐ అంజిబాబు చెప్పారు.

ఎస్‌ఐ కథనం మేరకు వివరాలివి. మండలంలో దిబ్బపాలెం గ్రామానికి చెందిన పి.మధు క్రికెట్‌ బెట్టింగ్‌లో నష్టం వచ్చిందని ఆవేదన చెందుతూ ఈనెల 23వ తేదీన గ్రామ సమీపంలో పొలాల్లో గులుకులు సేవించాడు. హుటాహుటిన కుటుంబ సభ్యులు విశాఖ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ చెప్పారు.
(టీడీపీ నేత వినోద్‌కుమార్‌ జైన్‌కు జీవితకాల జైలుశిక్ష)

Advertisement
Advertisement