● కలెక్టర్ రవి పట్టాన్శెట్టి
వర్క్షాపులో ప్రసంగిస్తున్న కలెక్టర్ రవి పట్టాన్శెట్టి
పరవాడ: బాలికా సాధికారితపై ప్రత్యేక దృష్టి సారించి వ్యక్తిత్వ వికాసాన్ని ప్రోత్సహించడానికి సింహాద్రి ఎన్టీపీసీ యాజమాన్యం చేస్తున్న కృషి అమోఘమని జిల్లా కలెక్టర్ రవి పట్టాన్శెట్టి అభినందించారు. సింహాద్రి ఎన్టీపీసీ సీఎస్సార్ విభాగం ఆధ్వర్యంలో దీపాంజలినగర్ టౌన్షిప్లో నిర్వహిస్తున్న బాలిక సాధికారత మిషన్ వర్క్షాప్–2023ను కలెక్టరు బుధవారం సందర్శించారు. బాలికలతో మాట్లాడారు. వారికి పలు సూచనలు చేశారు. భవిష్యత్లో ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి బాటలు వేసుకోవడంతో పాటు జీవితంలో విజయాలే లక్ష్యంగా కృషి చేయాలని కలెక్టర్ రవి పట్టాన్శెట్టి బాలికలకు సూచించారు. కార్యక్రమంలో సంస్థ జీజీఎం సంజయ్కుమార్ సిన్హా, చీఫ్ జనరల్ మేనేజర్ గోవిందరాజన్, హెచ్ఆర్ హెడ్ రుమాడీశర్మ, పలువురు అధికారులు పాల్గొన్నారు.