నారపాకలో పట్టపగలే చోరీ | Sakshi
Sakshi News home page

నారపాకలో పట్టపగలే చోరీ

Published Sat, Sep 23 2023 2:02 AM

ఇంట్లో చిందర వందరగా వస్తువులు పడేసిన దృశ్యం - Sakshi

● రూ.50 వేలు, 3 తులాల బంగారు నగలతో ఉడాయింపు

అచ్యుతాపురం(అనకాపల్లి): అచ్యుతాపురం మండలం ఆవరాజం శివారు నారపాకలో పట్టపగలే గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారు. శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో నారపాక జంక్షన్‌కు సమీపంలోని మొల్లి నాగమణి ఇంట్లోకి ప్రవేశించి తలుపు తాతాలు పగలు గొట్టడంతోపాటు బీరువాను పెకిలించారు. గదిలోని వస్తువుల్ని చిందర వందరగా పడేశారు. రూ.50 వేలతోపాటు మూడు తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకుపోయారు. బాధితురాలు గుర్తించి లబోదిబోమంటోంది. ఈ విషయమై పోలీసులు ఇంకా కేసు నమోదు చేయాల్సి ఉంది.

Advertisement
Advertisement