రాష్ట్ర స్థాయి క్రీడల్లో జన్నవరం విద్యార్థుల ప్రతిభ | Sakshi
Sakshi News home page

రాష్ట్ర స్థాయి క్రీడల్లో జన్నవరం విద్యార్థుల ప్రతిభ

Published Wed, Nov 15 2023 1:48 AM

రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చూపిన విద్యార్థులతో ఉపాధ్యాయ బృందం  - Sakshi

చోడవరం రూరల్‌ : స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ నిర్వహిస్తున్న 67వ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో మండలంలోని జన్నవరం పాఠశాల విద్యార్థులు తమ ప్రతిభను చాటుతున్నారు. ఈ నెల 9,10,11 తేదీలలో అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు జెడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి వాలీబాల్‌ పోటీలో ఉమ్మడి విశాఖ జిల్లా జట్టులో ఆడుతున్న జన్నవరం జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థిని నిట్లా చంద్రకళ జట్టు రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానంలో నిలిచింది. వాలీబాల్‌తో పాటు బ్యాడ్మింటన్‌, త్రో బాల్‌ క్రీడలలో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై న విద్యార్థులు తరుణ్‌, రఘు, సుగంధి మేఘనలను మంగళవారం బాలల దినోత్సవం సందర్భంగా వ్యాయామ ఉపాధ్యాయుడు ఎస్‌.శ్రీనివాసరావులను పాఠశాల ప్రధానోపాధ్యాయిని పద్మావతి, ఎస్‌.ప్రభాకర్‌, గ్రామ సర్పంచ్‌ కోసం సన్యాసిరావు, పాఠశాల చైర్మన్‌ ముచ్చకర్ల రమేష్‌ అభినందించారు. క్రీడలలో విద్యార్థులు మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని వారంతా ఆకాంక్షించారు.

Advertisement
Advertisement