కుషన్ భాస్కర్తో హరిపాలెం ఉన్నత పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది
అచ్యుతాపురం(అనకాపల్లి): అచ్యుతాపురం మండలంలోని హరిపాలెం ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ఎ.కుషన్ భాస్కర్ వాలీబాల్ రాష్ట్ర స్థాయి పోటీల్లో బంగారు పతకం సాధించాడు. ఈ నెల 9 నుంచి 11 వరకూ మూడు రోజుల పాటు అరకులోయ జీటీడబ్ల్యూఏ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన స్టేట్ మీట్లో అండర్–14 విభాగంలో అంతర్ జిల్లాల 67వ స్కూల్ గేమ్స్లో ఉమ్మడి విశాఖ జిల్లా తరపున పాల్గొన్న కుషన్ భాస్కర్ మెరుగైన ప్రతిభ కనబరిచినట్టు హెచ్ఎం ఎస్.రవి తెలిపారు. ఈ మేరకు పీఈటీ ధర్మిరెడ్డి రాజును అభినందించారు.