రైలు నుంచి జారిపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి | Sakshi
Sakshi News home page

రైలు నుంచి జారిపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి

Published Sat, Nov 25 2023 1:48 AM

రైల్వేట్రాక్‌పై మృతదేహాన్ని పరిశీలిస్తున్న ఎస్‌ఐ శాంతారాం  - Sakshi

అనకాపల్లిటౌన్‌: యలమంచిలి నుంచి విశాఖ వైపు వెళ్తున్న గుర్తుతెలియని రైలు నుంచి జారిపడి సుమారు 50 ఏళ్ల వయస్సు గల వ్యక్తి శుక్రవారం మృతిచెందినట్టు దువ్వాడ జీఆర్‌పీ ఎస్‌ఐ శాంతారాం చెప్పారు. మృతదేహాన్ని గ్యాంగ్‌మెన్‌ గమనించి స్థానిక స్టేషన్‌ మేనేజర్‌కు సమాచారం అందించారని, అక్కడి నుంచి అందిన సమాచారం మేరకు శారదానది రైల్వేబ్రిడ్జి వద్దకు చేరుకుని మృతదేహాన్ని పరిశీలించినట్టు ఎస్‌ఐ తెలిపారు. బ్లూకలర్‌ జీన్‌ఫ్యాంట్‌, ముదురు ఆకుపచ్చ గళ్లచొక్కా మృతుడు ధరించి ఉన్నాడని ఎస్‌ఐ తెలిపారు. మృతదేహాన్ని ఎన్టీఆర్‌ వైద్యాలయం మార్చురీకి తరలించి కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ చెప్పారు. వివరాల కోసం 7673906010 అనే ఫోన్‌ నంబర్‌లో సంప్రదించాలని ఆయన కోరారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement