నేడు జిల్లావ్యాప్తంగా ఎన్‌ఎంఎంఎస్‌ పరీక్ష | Sakshi
Sakshi News home page

నేడు జిల్లావ్యాప్తంగా ఎన్‌ఎంఎంఎస్‌ పరీక్ష

Published Sun, Dec 3 2023 1:42 AM

-

అనకాపల్లి టౌన్‌: జాతీయస్థాయి ఉపకార వేతన (ఎన్‌ఎంఎంఎస్‌) పరీక్షను ఆదివారం నిర్వహిస్తున్నట్లు డీఈవో ఎం.వెంకటలక్ష్మమ్మ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షకు జిల్లాలో 4,150 మంది విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నట్టు చెప్పారు. రెండు తనిఖీ బృందాలను, 36 మంది చీఫ్‌ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్‌ అధికారులు, 200మంది ఇన్విజిలేటర్లను నియమించామన్నారు. అనకాపల్లి, నర్సీపట్నం డివిజన్ల పరిధి 18 కేంద్రాల్లో పరీక్ష ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉంటుందన్నారు.

Advertisement
Advertisement