రాష్ట్ర స్థాయి కళా ఉత్సవ పోటీలకు కాశీపురం విద్యార్థిని | Sakshi
Sakshi News home page

రాష్ట్ర స్థాయి కళా ఉత్సవ పోటీలకు కాశీపురం విద్యార్థిని

Published Thu, Dec 14 2023 1:26 AM

విద్యార్థిని వరలక్ష్మికి పురస్కారం అందిస్తున్న డైట్‌ ప్రిన్సిపాల్‌ రవి   - Sakshi

● జిల్లా సంప్రదాయక ఆట బొమ్మల తయారీలో ప్రథమ స్థానం

దేవరాపల్లి: రాష్ట్ర స్థాయి కళా ఉత్సవ పోటీలకు మండలంలోని కాశీపురం హైస్కూల్‌కు చెందిన 9వ తరగతి విద్యార్థిని బాలిబోయిన వరలక్ష్మి ఎంపికై ంది. మానవ వనరుల శాఖ ఆధ్వర్యంలో భీమిలి ఉపాధ్యాయ శిక్షణా సంస్థలో ఉమ్మడి జిల్లా స్థాయి కళా ఉత్సవ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సంప్రదాయక ఆట బొమ్మల తయారీలో ఆమె ప్రథమ స్థానంలో నిలిచి భీమిలి డైట్‌ ప్రిన్సిపాల్‌ జి. రవి నుంచి జ్ఞాపిక, ప్రశంసా పత్రాన్ని అందుకుంది. ఈ నెల 14, 15 తేదీల్లో అమరావతిలో నిర్వహించే రాష్ట్ర స్థాయి కళా ఉత్సవ పోటీల్లో పాల్గొననుందని హెచ్‌ఎం పి.బి.టి. సుందరీ తెలిపారు. ఇదే హైస్కూల్‌లో 9వ తరగతి చదువుతున్న కొరువాడ విజయ జిల్లా స్థాయి జానపద పాటల పోటీల్లో తృతీయ స్థానంలో నిలిచిందన్నారు. వీరిని ఎంఈవోలు, బి.పడాల్‌ దాస్‌, వి. ఉషారాణి, హెచ్‌ఎంతోపాటు సర్పంచ్‌ ఎ. వరలక్ష్మి, పేరెంట్స్‌ కమిటీ చైర్మన్‌ దాసరి సూర్యనారాయణ బుధవారం అభినందించారు.

Advertisement
Advertisement