జనసేన నుంచి వైఎస్సార్‌సీపీలోకి.. | Sakshi
Sakshi News home page

జనసేన నుంచి వైఎస్సార్‌సీపీలోకి..

Published Tue, Apr 23 2024 8:40 AM

- - Sakshi

ఎమ్మెల్యే గణేష్‌ సమక్షంలో పార్టీలో చేరిన జనసేన నాయకుడు గుండుబొగుల శ్రీనివాస్‌

నర్సీపట్నం: జనసేన నియోజకవర్గ మాజీ ఇన్‌చార్జి గుండుబొగుల శ్రీనివాస్‌ సోమవారం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌ గణేష్‌ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. ఎమ్మెల్యే ఆయనకు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఇతను గతంలో జనసేన అనకాపల్లి పార్లమెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌గా పనిచేశారు. జనసేనకు పట్టు ఉన్న నాయకుడైన శ్రీనివాస్‌ వైఎస్సార్‌సీపీలో చేరడంతో కూటమికి గట్టి ఎదురు దెబ్బతగిలింది. చేరిక కార్యక్రమంలో పార్టీ సీనియర్‌ నాయకులు చింతకాయల సన్యాసిపాత్రుడు, రుత్తల ఎర్రాపాత్రు డు, జెడ్పీటీసీ సుర్ల గిరిబాబు, గొలుగొండ మండల పార్టీ అధ్యక్షుడు లెక్కల సత్యనారాయణ పాల్గొన్నారు.

Advertisement
Advertisement